Trends

ప్రజలకు సీరియస్ సలహా ఇచ్చిన కేంద్ర మంత్రి

సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కీలక సూచన చేశారు కేంద్ర టెలికం శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్. మొబైల్ ఫోన్లకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను అస్సలు ఎత్తొద్దని.. తెలిసిన నంబర్లకు మాత్రమే స్పందించాలని కోరారు. ఇటీవల కాలంలో టెలికం శాఖ తీసుకున్న చర్యలతో స్పామ్ కాల్స్.. సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు తగ్గినట్లుగా చెప్పిన ఆయన తాను చేసిన సూచనను సీరియస్ గా తీసుకోవాలన్నారు.

“తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను ఎప్పుడూ ఆన్సర్ చేయొద్దు. గుర్తించిన నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ కే స్పందించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్క పౌరుడికి విజ్ఞప్తి చేస్తున్నా. గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు.. ఎవరి నుంచి ఆ మెసేజ్ వచ్చిందో నిర్దారించుకున్న తర్వాతే స్పందించాలి” అని ఆయన కోరారు.

దాదాపు 40 లక్షలకు పైగా తప్పుడు సిమ్ లు.. 41 వేల అక్రమ పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లుగా చెప్పారు. ఇలాంటి కేసుల్ని గణనీయంగా తగ్గించటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉయోగిస్తున్నట్లుగా చెప్పారు. సో.. ఫోన్లు వాడుతున్న వారంతా.. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బీకేర్ ఫుల్.

This post was last modified on June 3, 2023 7:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎం

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే విజ‌యం దక్కించుకుంటామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు…

1 hour ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

2 hours ago

రుషికొండ ప్యాలెస్ విశాఖకే ఆణిముత్యమా?

వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…

2 hours ago

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…

3 hours ago

జగన్ కోటి సంతకాల కృషి ఫలించేనా?

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…

3 hours ago

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

5 hours ago