సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కీలక సూచన చేశారు కేంద్ర టెలికం శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్. మొబైల్ ఫోన్లకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను అస్సలు ఎత్తొద్దని.. తెలిసిన నంబర్లకు మాత్రమే స్పందించాలని కోరారు. ఇటీవల కాలంలో టెలికం శాఖ తీసుకున్న చర్యలతో స్పామ్ కాల్స్.. సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు తగ్గినట్లుగా చెప్పిన ఆయన తాను చేసిన సూచనను సీరియస్ గా తీసుకోవాలన్నారు.
“తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను ఎప్పుడూ ఆన్సర్ చేయొద్దు. గుర్తించిన నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ కే స్పందించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్క పౌరుడికి విజ్ఞప్తి చేస్తున్నా. గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు.. ఎవరి నుంచి ఆ మెసేజ్ వచ్చిందో నిర్దారించుకున్న తర్వాతే స్పందించాలి” అని ఆయన కోరారు.
దాదాపు 40 లక్షలకు పైగా తప్పుడు సిమ్ లు.. 41 వేల అక్రమ పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లుగా చెప్పారు. ఇలాంటి కేసుల్ని గణనీయంగా తగ్గించటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉయోగిస్తున్నట్లుగా చెప్పారు. సో.. ఫోన్లు వాడుతున్న వారంతా.. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బీకేర్ ఫుల్.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…