కోజికోడ్ విమాన దుర్ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. విధి వైచిత్రం కాకుంటే.. అసలీ ప్రమాదం జరగాల్సిందేనా? అన్నది చూస్తే.. నో అనే మాట అనిపించక మానదు. చావు రాసి పెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరన్నట్లుగా ఈ ప్రమాదం కనిపించక మానదు.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. భారీగా వరద నీరు ఒక వీధిలో ఉంటుంది. అందులో ఇద్దరు వ్యక్తులు నిలుచొని ఉంటారు. ఒకరు ముందుకు వెళుతుంటే.. మరొకరు వెనుకగా ఉంటారు. చేతిలో మొబైల్ లో ఏదో చూస్తూ ఉన్న ఆ మహిళను ముందు వ్యక్తి పిలవటం.. సరేనని తను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళుతుంది. అలా వెళ్లిన రెండు మూడు సెకన్ల వ్యవధిలోనే అప్పటివరకు మామూలుగా ఉన్న ఒక భవనం గోడ కుప్పకూలిపోతుంది.
బతికి ఉండాలని రాసి పెడితే.. ప్రకృతి సైతం సహనంగా వెయిట్ చేస్తుంటుందన్న మాటతో ఆ వీడియో ముగుస్తుంది. తాజాగా కోడికోడ్ దుర్ఘటననను చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఈ విమానాన్ని నడిపిన పైలెట్ బోయింగ్ విమానాల్ని నడపటంలో దిట్ట. అతని ట్రాక్ రికార్డు తిరుగులేనిది. ఎయిర్ ఫోర్సులో రిటైర్ అయిన దీపక్ వసంత్ సాథే.. 2005లో ఎయిరిండియాలో జాయిన్ అయ్యారు.
భారత వైమానిక దళంలో పని చేసిన సమయంలో ఆయన మిగ్ 21లకు పైలట్ గా వ్యవహరించారు. ఎయిర్ ఫోర్సు అకాడమీలో పైలట్ కోర్సును స్వోర్డ్ఆఫ్ ఆనర్ గౌరవంతో పూర్తి చేశారు. 2003లో ఎయిర్ ఫోర్సు నుంచి బయటకు వచ్చారు. అంకితభావం.. అంతకు మించి విమానాల్ని నడపటంలో అపారమైన అనుభవం ఆయన సొంతం. గతంలో రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా సాధించిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. అలాంటి ఆయన నడిపిన విమానం ఇంతటి ఘోర ప్రమాదానికి కారణం కావటం చూస్తే.. విధి మహిమ తప్పించి మరేమైనా అనుకోగలమా?
This post was last modified on August 8, 2020 2:22 pm
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…