Trends

ఎవ‌రు వ‌చ్చినా.. ఆ రెండు స్థానాలూ వైసీపీకి ద‌క్కేలా లేవే!

ఇటీవ‌ల వైసీపీకి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర స‌ర్వే అంటూ..ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఒక జాతీయ మీడియా వ‌చ్చే 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వైసీపీ 25 స్థానాల‌కు 24 చోట్ల గెలుస్తుంద‌ని పేర్కొంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తే.. ఈ స‌ర్వే ఎంత త‌ప్పో చెప్ప‌డానికి రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాయి. ఉమ్మ‌డి కృష్ణాలో రెండు ఎంపీ స్థానాలు విజ‌య‌వాడ‌-మ‌చిలీప‌ట్నం ఉన్నాయి. 2014లో రెండు కూడా టీడీపీ ద‌క్కించుకుంది. విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ జెండా రెప‌రెప‌లాడింది.

అయితే.. 2019కి వ‌చ్చేసరికి.. మ‌చిలీపట్నం వైసీపీ ఖాతాలో ప‌డింది. విజ‌య‌వాడ మ‌ళ్లీ టీడీపీకే ద‌క్కింది. వైసీపీ విశ్వ‌ప్ర‌యత్నం చేసినా ఫ‌లించలేదు. అయితే.. ఈ ద‌ఫా 2024 ఎన్నిక‌ల్లో మాత్రం ఈ రెండు కూడా టీడీపీకే ద‌క్క‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌చిలీపట్నం ఎంపీగా ఉన్న వైసీపీ నాయ‌కుడు బాల‌శౌరి ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే.. ఓడించేందుకు సొంత పార్టీ నాయ‌కులే రెడీగా ఉన్నార‌నేది కొన్నాళ్లుగా వినిపిస్తున్న వాద‌న‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న న‌ర‌సారావుపేట‌కు వెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. దీంతో ఇక్కడ కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాల‌నేది ప్లాన్‌.

కానీ, ఎవ‌రు వ‌చ్చినా.. టీడీపీ నేత కొన‌క‌ళ్ల నారాయ‌ణ ముందు నిలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇక విజ‌య‌వాడ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసే నాయ‌కుడు తెర‌మీదికి రాలేదు. గ‌త ఎన్నిక‌ల్లో పొట్లూరి వీర‌ప్ర‌సాద్‌(పీవీపీ ప్ర‌సాద్‌) పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆయ‌న మాత్రం తాను ఓడిపోయినా..విజ‌య‌వాడ వాసుల‌కు అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఐపు లేకుండా పోయారు. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ త‌ర‌ఫున ఎంపీ అభ్య‌ర్థిగా తెర‌మీదికి రాలేదు.

ఇదిలావుంటే.. టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బ‌డ్డా.. వారి గెలుపున‌కు సాయం చేస్తాన‌ని.. ప్ర‌స్తుత ఎంపీ కేశినేని శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే.. ఆయ‌న‌కే టికెట్ ఇస్తార‌ని.. పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. గ్రామీణ స్థాయిలో ప‌ట్టు పెంచుకున్న కేశినేని.. గెలుపు అనివార్యంగా మారింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ విధంగా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కానీ, స‌ర్వే మాత్రం 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుస్తుంద‌ని పేర్కొన‌డాన్ని బ‌ట్టి అస‌లు క్షేత్ర‌స్థాయిలో స‌ర్వే చేశారా? పోసుగోలు క‌బుర్లు చెప్పారా? అనే చ‌ర్చ సాగుతోంది. జిల్లాల వారీగా వివ‌రిస్తే.. మ‌రిన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి వ్య‌తిరేక‌త ఎంతుందో తెలుస్తుంద‌ని అంటున్నారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

14 minutes ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

2 hours ago

ఓజి… వరప్రసాద్… పెద్ది?

మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…

3 hours ago

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం…

3 hours ago

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

4 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

5 hours ago