Trends

ఎవ‌రు వ‌చ్చినా.. ఆ రెండు స్థానాలూ వైసీపీకి ద‌క్కేలా లేవే!

ఇటీవ‌ల వైసీపీకి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర స‌ర్వే అంటూ..ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఒక జాతీయ మీడియా వ‌చ్చే 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వైసీపీ 25 స్థానాల‌కు 24 చోట్ల గెలుస్తుంద‌ని పేర్కొంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తే.. ఈ స‌ర్వే ఎంత త‌ప్పో చెప్ప‌డానికి రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాయి. ఉమ్మ‌డి కృష్ణాలో రెండు ఎంపీ స్థానాలు విజ‌య‌వాడ‌-మ‌చిలీప‌ట్నం ఉన్నాయి. 2014లో రెండు కూడా టీడీపీ ద‌క్కించుకుంది. విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ జెండా రెప‌రెప‌లాడింది.

అయితే.. 2019కి వ‌చ్చేసరికి.. మ‌చిలీపట్నం వైసీపీ ఖాతాలో ప‌డింది. విజ‌య‌వాడ మ‌ళ్లీ టీడీపీకే ద‌క్కింది. వైసీపీ విశ్వ‌ప్ర‌యత్నం చేసినా ఫ‌లించలేదు. అయితే.. ఈ ద‌ఫా 2024 ఎన్నిక‌ల్లో మాత్రం ఈ రెండు కూడా టీడీపీకే ద‌క్క‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌చిలీపట్నం ఎంపీగా ఉన్న వైసీపీ నాయ‌కుడు బాల‌శౌరి ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే.. ఓడించేందుకు సొంత పార్టీ నాయ‌కులే రెడీగా ఉన్నార‌నేది కొన్నాళ్లుగా వినిపిస్తున్న వాద‌న‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న న‌ర‌సారావుపేట‌కు వెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. దీంతో ఇక్కడ కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాల‌నేది ప్లాన్‌.

కానీ, ఎవ‌రు వ‌చ్చినా.. టీడీపీ నేత కొన‌క‌ళ్ల నారాయ‌ణ ముందు నిలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇక విజ‌య‌వాడ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసే నాయ‌కుడు తెర‌మీదికి రాలేదు. గ‌త ఎన్నిక‌ల్లో పొట్లూరి వీర‌ప్ర‌సాద్‌(పీవీపీ ప్ర‌సాద్‌) పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆయ‌న మాత్రం తాను ఓడిపోయినా..విజ‌య‌వాడ వాసుల‌కు అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఐపు లేకుండా పోయారు. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ త‌ర‌ఫున ఎంపీ అభ్య‌ర్థిగా తెర‌మీదికి రాలేదు.

ఇదిలావుంటే.. టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బ‌డ్డా.. వారి గెలుపున‌కు సాయం చేస్తాన‌ని.. ప్ర‌స్తుత ఎంపీ కేశినేని శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే.. ఆయ‌న‌కే టికెట్ ఇస్తార‌ని.. పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. గ్రామీణ స్థాయిలో ప‌ట్టు పెంచుకున్న కేశినేని.. గెలుపు అనివార్యంగా మారింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ విధంగా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కానీ, స‌ర్వే మాత్రం 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుస్తుంద‌ని పేర్కొన‌డాన్ని బ‌ట్టి అస‌లు క్షేత్ర‌స్థాయిలో స‌ర్వే చేశారా? పోసుగోలు క‌బుర్లు చెప్పారా? అనే చ‌ర్చ సాగుతోంది. జిల్లాల వారీగా వివ‌రిస్తే.. మ‌రిన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి వ్య‌తిరేక‌త ఎంతుందో తెలుస్తుంద‌ని అంటున్నారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

7 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago