ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అసలేం జరుగుతుందో అస్సలు బయటకు రావు. ఆ కోవలోకే వస్తుంది రష్యా. సుదీర్ఘకాలం కమ్యునిస్టుల ఏలుబడిలో సాగిన ఆ దేశం.. ఇప్పుడు పుతిన్ పుణ్యమా అని ప్రజాస్వామ్య నియంతృత్వంలో సాగుతోంది. ఇటీవల రాజ్యాంగంలో చేసిన మార్పులతో పుతిన్ జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ను తాము సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచిందా దేశం.
ఎందుకంటే.. రష్యా నుంచి ప్రకటన వచ్చే వరకూ ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్ మీద సాగుతున్న ప్రయోగాల మీద ప్రపంచం పెద్దగా ఫోకస్ చేసింది లేదు. అందుకు భిన్నంగా త్వరలో టీకాను తీసుకొచ్చేస్తున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యంలోకి ముంచెత్తారు. అయితే.. ఇదేమీ సాధ్యం కాదన్న మాట వినిపించింది.
ఇందుకు భిన్నంగా తాజాగా మరో ఆసక్తికర ప్రకటన బయటకు వచ్చింది. ఆగస్టు పది నుంచి పన్నెండు తేదీల్లోగా కరోనాకు టీకాను తాము విడుదల చేయనున్నట్లుగా రష్యా చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గామాలెయ ఇన్ స్టిట్యూట్ రూపందించిన ఈ టీకాకు సాధ్యమైనంత త్వరగా అనుమతి ఇవ్వాలన్న ఆలోచనలో రష్యా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ బ్లూమ్ బర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే మానవ ప్రయోగాల దశ కూడా స్టార్ట్ అయ్యిందని.. జులై 27నఐదుగురు వాలంటీర్లకు టీకాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వారు ఎలాంటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోలేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. టీకాను విడుదల చేయాలన్న తొందరలో రష్యా భద్రతా ప్రమాణాలు పాటించటం లేదని చెబుతున్నారు. మరి.. ఇలాంటి వేళ రష్యా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మీద అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఏ మేరకు నిజమవుతాయో చూడాలి.
This post was last modified on July 31, 2020 12:15 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…