Trends

‘ఒక్క వేటు’కు రెండు లాభాలు.. భ‌ర్త‌ను చంపిన భార్య‌!!

మూడుముళ్ల బంధంతో ఒక్క‌టైన స్త్రీ, పురుషుడు జీవితాంతం తోడు నీడ‌గా ఉంటార‌ని, వారిని క‌న్న త‌ల్లి దండ్రులు ఆశిస్తారు. అయితే.. ఇప్పుడు ఈ తోడు, నీడ‌ల మాటేమోకానీ.. లేనిపోని ఆలోచన‌ల‌తో జీవితాల‌ను దుర్భరం చేసుకునే ప‌రిస్థితికి వ‌స్తున్నాయి. తాజాగా ఓ భార్య ఖ‌త‌ర్నాక్ ప‌నిచేసింది. త‌న భ‌ర్త చ‌నిపోగా వ‌చ్చే ఉద్యోగంపై క‌న్నేసింది. భ‌ర్త‌ను చంపేస్తే.. కారుణ్య కోటా కింద‌.. ఆయ‌న ఉద్యోగం ప‌ట్టేయొచ్చ‌ని ప్లాన్ చేసింది. అంతే.. ఇంకేముంది.. దారుణానికి వ‌డిగ‌ట్టింది.

ఏం జ‌రిగిందంటే..

తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని గాంధీ కాల‌నీలో కొమ్మ‌ర బోయిన శ్రీనివాస్‌(50), సీతామ‌హాలక్ష్మి దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరికి వివాహ‌మై.. దాదాపు 25 ఏళ్ల‌పైగానే అవుతుంది. ఇక‌, శ్రీనివాస్‌.. కొత్త‌గూడెం క‌లెక్ట‌రేట్‌లో అటెండ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈయ‌న‌కు.. మ‌ద్యం తాగే అల‌వాటు ఉంది. రోజూ తాగి రావ‌డం.. భార్య‌ను వేధించ‌డం.. ప‌నిగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

అంతేకాదు.. ఇంట్లోకి కూడా డ‌బ్బులు స‌రిగా ఇవ్వ‌డం లేదని భార్య ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో విసిగిపోయిన భార్య‌.. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా.. వ్యూహం రెడీ చేసుకుంది. ఎన్నాళ్లు ఈ వేధింపులు భ‌రిస్తాను అనుకుందో ఏమో.. వెంట‌నే ఒక ప్లాన్ చేసుకుంది. గ‌త‌ నెల 29న భ‌ర్త తాగి ఇంటికి వ‌చ్చి ప‌డుకున్న స‌మ‌యంలో ఆయ‌న‌పై రోక‌లి బండ‌తో ఒక్క‌బాదు బాది చంపేసింది. అనంత‌రం, బాడీని వంట‌గ‌దిలోకి తీసుకువెళ్లి ప‌డుకోపెట్టింది. త‌ద్వారా.. వేధింపులు త‌ప్ప‌డంతోపాటు.. మ‌రోవైపు కారుణ్య మ‌ర‌ణం కింద ప్ర‌భుత్వ కొలువు కూడా ద‌క్కుతుంద‌ని ఆమె లెక్క‌లు వేసుకుంది.

ఇదీ క‌ల‌రింగ్‌

అయితే..హ‌త్య‌కు గురైన వ్య‌క్తికి కారుణ్య మ‌ర‌ణం వ‌ర్తించ‌దు క‌నుక‌.. త‌ను హ‌త్య చేస్తే.. అస‌లుకే మోసం వ‌స్తుంది కాబ‌ట్టి.. సీతామ‌హాల‌క్ష్మి బిగ్ ప్లాన్ చేసింది. గత నెల 29న అర్ధరాత్రి తన భ‌ర్త‌ వంటింట్లో జారిపడ్డాడని, తలకు తీవ్ర గాయమైందని సీతామహాలక్ష్మి మర్నాడు ఉదయం కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది. కొద్దిగంటల చికిత్స అనంతరం ఆయన మృతి చెందాడు. ఇక్క‌డితో త‌ను సేఫ్ అయిపోయాన‌ని ఆమె భావించింది.

కానీ, యూట‌ర్న్‌

తండ్రి మృతిపై అనుమానం ఉన్నట్లు కుమారుడు సాయికుమార్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కనిపించకుండా పోయిన సీతామహాలక్ష్మిపై పోలీసులు కూడా నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు రాగా అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అస‌లు విష‌యం వెలుగు చూసి.. ఖ‌త‌ర్నాక్ భార్య‌.. క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లింది.

This post was last modified on January 5, 2023 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

24 minutes ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

1 hour ago

అస్సీలో అంత మ్యాటర్ ఉందంటారా

గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…

3 hours ago

టాక్సిక్ ఇష్టం మనోళ్లకే ఎక్కువ ఉంది

ఇటీవలే విడుదలైన టాక్సిక్ టీజర్ మీద పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వయొలెన్స్ ఎక్కువయ్యిందని…

4 hours ago

విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…

6 hours ago

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

7 hours ago