Trends

‘ఒక్క వేటు’కు రెండు లాభాలు.. భ‌ర్త‌ను చంపిన భార్య‌!!

మూడుముళ్ల బంధంతో ఒక్క‌టైన స్త్రీ, పురుషుడు జీవితాంతం తోడు నీడ‌గా ఉంటార‌ని, వారిని క‌న్న త‌ల్లి దండ్రులు ఆశిస్తారు. అయితే.. ఇప్పుడు ఈ తోడు, నీడ‌ల మాటేమోకానీ.. లేనిపోని ఆలోచన‌ల‌తో జీవితాల‌ను దుర్భరం చేసుకునే ప‌రిస్థితికి వ‌స్తున్నాయి. తాజాగా ఓ భార్య ఖ‌త‌ర్నాక్ ప‌నిచేసింది. త‌న భ‌ర్త చ‌నిపోగా వ‌చ్చే ఉద్యోగంపై క‌న్నేసింది. భ‌ర్త‌ను చంపేస్తే.. కారుణ్య కోటా కింద‌.. ఆయ‌న ఉద్యోగం ప‌ట్టేయొచ్చ‌ని ప్లాన్ చేసింది. అంతే.. ఇంకేముంది.. దారుణానికి వ‌డిగ‌ట్టింది.

ఏం జ‌రిగిందంటే..

తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని గాంధీ కాల‌నీలో కొమ్మ‌ర బోయిన శ్రీనివాస్‌(50), సీతామ‌హాలక్ష్మి దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరికి వివాహ‌మై.. దాదాపు 25 ఏళ్ల‌పైగానే అవుతుంది. ఇక‌, శ్రీనివాస్‌.. కొత్త‌గూడెం క‌లెక్ట‌రేట్‌లో అటెండ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈయ‌న‌కు.. మ‌ద్యం తాగే అల‌వాటు ఉంది. రోజూ తాగి రావ‌డం.. భార్య‌ను వేధించ‌డం.. ప‌నిగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

అంతేకాదు.. ఇంట్లోకి కూడా డ‌బ్బులు స‌రిగా ఇవ్వ‌డం లేదని భార్య ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో విసిగిపోయిన భార్య‌.. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా.. వ్యూహం రెడీ చేసుకుంది. ఎన్నాళ్లు ఈ వేధింపులు భ‌రిస్తాను అనుకుందో ఏమో.. వెంట‌నే ఒక ప్లాన్ చేసుకుంది. గ‌త‌ నెల 29న భ‌ర్త తాగి ఇంటికి వ‌చ్చి ప‌డుకున్న స‌మ‌యంలో ఆయ‌న‌పై రోక‌లి బండ‌తో ఒక్క‌బాదు బాది చంపేసింది. అనంత‌రం, బాడీని వంట‌గ‌దిలోకి తీసుకువెళ్లి ప‌డుకోపెట్టింది. త‌ద్వారా.. వేధింపులు త‌ప్ప‌డంతోపాటు.. మ‌రోవైపు కారుణ్య మ‌ర‌ణం కింద ప్ర‌భుత్వ కొలువు కూడా ద‌క్కుతుంద‌ని ఆమె లెక్క‌లు వేసుకుంది.

ఇదీ క‌ల‌రింగ్‌

అయితే..హ‌త్య‌కు గురైన వ్య‌క్తికి కారుణ్య మ‌ర‌ణం వ‌ర్తించ‌దు క‌నుక‌.. త‌ను హ‌త్య చేస్తే.. అస‌లుకే మోసం వ‌స్తుంది కాబ‌ట్టి.. సీతామ‌హాల‌క్ష్మి బిగ్ ప్లాన్ చేసింది. గత నెల 29న అర్ధరాత్రి తన భ‌ర్త‌ వంటింట్లో జారిపడ్డాడని, తలకు తీవ్ర గాయమైందని సీతామహాలక్ష్మి మర్నాడు ఉదయం కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది. కొద్దిగంటల చికిత్స అనంతరం ఆయన మృతి చెందాడు. ఇక్క‌డితో త‌ను సేఫ్ అయిపోయాన‌ని ఆమె భావించింది.

కానీ, యూట‌ర్న్‌

తండ్రి మృతిపై అనుమానం ఉన్నట్లు కుమారుడు సాయికుమార్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కనిపించకుండా పోయిన సీతామహాలక్ష్మిపై పోలీసులు కూడా నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు రాగా అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అస‌లు విష‌యం వెలుగు చూసి.. ఖ‌త‌ర్నాక్ భార్య‌.. క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లింది.

This post was last modified on January 5, 2023 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

58 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago