Trends

భారత క్రికెట్లో పెను మార్పులు?

గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడడమే కాక.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది భారత జట్టు. ఈ ఏడాది పాకిస్థాన్ మీద అతి కష్టం మీద నెగ్గారు. సూపర్-12 కూడా దాటారు. కానీ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి నిష్క్రమించారు. పేరుకు ప్రపంచ అత్యుత్తమ జట్లలో ఒకటి. కానీ పెద్ద టోర్నీలు ఏవి వచ్చినా ప్రదర్శన అంతంతమాత్రం.

ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌లో కూడా టీమ్ ఇండియా పెర్ఫామెన్స్ పేలవమే. పేరు గొప్ప ఊరు దిబ్బ టైపు ఆటగాళ్లను నమ్ముకుని భారత జట్టు దారుణంగా దెబ్బ తింటోందన్నది స్పష్టం. ఓవైపు ఇంగ్లాండ్ లాంటి జట్లు రోజు రోజుకూ భీకరంగా తయారవుతుంటే.. భారత జట్టు బలహీనంగా తయారవుతోంది. ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత ప్రక్షాళన చేపట్టకపోతే జట్టు మెరుగపడదని బీసీసీఐ బలంగానే ఫిక్సయినట్లుగా కనిపిస్తోంది.

దిద్దుబాటు చర్యల్లో భాగంగా ముందు సెలక్షన్ కమిటీ మీద వేటు వేసింది. గత రెండు టీ20 ప్రపంచకప్‌లకూ జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీకి మొత్తంగా ఉద్వాసన పలికింది. వీరి వల్ల మళ్లీ భారత జట్టులో కోటా విధానం వచ్చిందని, కొందరు ఆటగాళ్ల పెర్ఫామెన్స్ బాగా లేకున్నా జట్టులో చోటు దక్కిందనే అభిప్రాయాలున్నాయి. అందుకే సెలక్షన్ కమిటీని మొత్తంగా తప్పించేసింది బీసీసీఐ. సెలక్షన్ కమిటీ విషయంలోనే ఇంత కఠినంగా ఉంటే.. ఇక జట్టు విషయంలో బీసీసీఐ ఏం చేయబోతోందన్నదీ తెలిసిపోతోంది.

టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ మీద వేటు పడడం లాంఛనమే అంటున్నారు. అలా జరగకపోయినా రోహితే తప్పుకుంటాడని సమాచారం. ఆల్రెడీ న్యూజిలాండ్ సిరీస్‌కు హార్దిక్ పాండ్య తాత్కాలిక కెప్టెన్‌గా వెళ్లాడు. అతనే పూర్తి స్తాయిలో పగ్గాలు అందుకోవడం పక్కా అని తెలుస్తోంది. కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించడం, రోహిత్ కూడా జట్టుకు దూరం కావడం ఫిక్స్ అని తెలుస్తోంది. కోహ్లి సంగతే తేలాల్సి ఉంది. అశ్విన్, దినేశ్ కార్తీక్, షమి, భువనేశ్వర్ లాంటి సీనియర్లకు మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కకపోవచ్చు. 2024 ప్రపంచకప్ దిశగా యువ జట్టును తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైనట్లే తెలుస్తోంది.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

4 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

4 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

6 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

6 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

6 hours ago