59 చైనీస్ మొబైల్ యాప్స్ ను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న సంచలన నిర్ణయంతో తగిలిన్ షాక్ నుంచే ఇంకా తేరుకోని చైనాను అమెరికా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయిన యాపిల్ భారీగా దెబ్బకొట్టింది. అయితే, ఇది తమ నిబంధనల సవరణలో భాగంగా మాత్రమే అని పేర్కొంది. తాజాగా యాపిల్ సంస్థ యాప్ స్టోర్ లోని 4500 చైనీస్ గేమ్ యాప్స్ ను తొలగించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో వీటిని తొలగించడం సంచలనం అయ్యింది.
ఈ నిర్ణయంపై పూర్తి క్లారిటీతో యాపిల్ ఒక ప్రకటన చేసింది. లైసెన్స్ నిబంధనలను తాము మరింత కఠినతరం చేస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించామని, అందులో భాగంగా ఈ యాప్స్ తమ అర్హతను కోల్పోవడం వల్ల తొలగించాం అని పేర్కొంది. వీటిని నిషేధించలేదు, కేవలం తొలగించాం అని చెప్పింది.
యాప్ స్టోర్ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఆ యాప్స్ ను రీడిజైన్ చేసుకుని, మా ప్రమాణాలకు అనుగుణంగా మారిస్తే యాప్ స్టోర్ లో మళ్లీ అప్ లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.
భారత్ నిర్ణయంతో ఇప్పిటే సుమారు లక్ష కోట్లు నష్టపోయినా చైనా… యాపిల్ కంపెనీ నిర్ణయంతో చావు దెబ్బ తినింది. ఈ చర్య చైనాను మరింత ఒత్తిడిలోకి నెట్టే ప్రమాదం ఉంది.
ఆర్థికంగా కూడా చైనా బాగా నష్టపోతుందని నిపుణులు చెబుతున్నారు. చట్టపరమైన అనుమతులు లేని గేమ్స్ తాము ఎన్నటికి అనుమతించమని… అన్ని దేశాల చట్టాలకు అనుగుణంగా ఉంటేనే వేటికైనా మా వద్ద స్థానం ఉంటుదని పేర్కొంది. సరిగ్గా ఈ ప్రకటనకు మూడు రోజుల ముందే ట్రంప్… నాకు చైనాపై రోజురోజుకు కోపం రెట్టింపవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్..…
గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…
బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.…