చైనాకు ఆదాయం తెచ్చి పెట్టడంతో పాటు మన డేటాను ఆ దేశానికి అందిస్తున్నాయన్న అనుమానాలతో ఒకేసారి 59 చైనా యాప్లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై నిన్నట్నుంచి పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యాప్లను అయితే సులువుగానే నిషేధించేశారు.. మరి చైనా ఉత్పత్తుల వినియోగం మాటేంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. దేశంలో చైనా కంపెనీలు వేలు, లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ దేశానికి చెందిన ఎన్నో ఉత్పత్తులు వాడుతున్నాం.. మరి వాటిని నియంత్రించడం ఎలా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఐతే దేశంలోకి చైనా పెట్టుబడుల రాక ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఏమీ ఆగలేదు. చైనా యాప్స్ను నిషేధించడానికి వారం కిందట ఒక ప్రముఖ కంపెనీలోకి చైనా ఫిర్మ్ నుంచి భారీ పెట్టుబడులు వచ్చాయి. భారత వ్యాపార దిగ్గజాల్లో ఒకరైనా అదానికి చెందిన గ్రూప్లోకి చైనా ఫిర్మ్ ఒకటి ఏకంగా 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.
చైనా యాప్స్ను నిషేధించడం గురించి ఓ వైపు చర్చ జరుగుతుండగా.. కేంద్రం ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తుండగానే ఈ డీల్ జరిగింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న సమయంలో వేచి చూసే ధోరణి లేకుండా ఇటు అదాని గ్రూప్ పెట్టుబడులకు ఆహ్వానం పలకడం, చైనా ఫిర్మ్ ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇలా మరెన్నో కంపెనీలు భారత్లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఇక ముందూ అవి ఆగే పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. మోడీ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చాక దేశంలో చైనా పెట్టుబడులు 500 శాతం పెరగడం గమనార్హం.
This post was last modified on July 1, 2020 10:10 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…