చైనాకు ఆదాయం తెచ్చి పెట్టడంతో పాటు మన డేటాను ఆ దేశానికి అందిస్తున్నాయన్న అనుమానాలతో ఒకేసారి 59 చైనా యాప్లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై నిన్నట్నుంచి పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యాప్లను అయితే సులువుగానే నిషేధించేశారు.. మరి చైనా ఉత్పత్తుల వినియోగం మాటేంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. దేశంలో చైనా కంపెనీలు వేలు, లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ దేశానికి చెందిన ఎన్నో ఉత్పత్తులు వాడుతున్నాం.. మరి వాటిని నియంత్రించడం ఎలా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఐతే దేశంలోకి చైనా పెట్టుబడుల రాక ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఏమీ ఆగలేదు. చైనా యాప్స్ను నిషేధించడానికి వారం కిందట ఒక ప్రముఖ కంపెనీలోకి చైనా ఫిర్మ్ నుంచి భారీ పెట్టుబడులు వచ్చాయి. భారత వ్యాపార దిగ్గజాల్లో ఒకరైనా అదానికి చెందిన గ్రూప్లోకి చైనా ఫిర్మ్ ఒకటి ఏకంగా 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.
చైనా యాప్స్ను నిషేధించడం గురించి ఓ వైపు చర్చ జరుగుతుండగా.. కేంద్రం ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తుండగానే ఈ డీల్ జరిగింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న సమయంలో వేచి చూసే ధోరణి లేకుండా ఇటు అదాని గ్రూప్ పెట్టుబడులకు ఆహ్వానం పలకడం, చైనా ఫిర్మ్ ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇలా మరెన్నో కంపెనీలు భారత్లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఇక ముందూ అవి ఆగే పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. మోడీ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చాక దేశంలో చైనా పెట్టుబడులు 500 శాతం పెరగడం గమనార్హం.
This post was last modified on July 1, 2020 10:10 am
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…