Trends

ఇటు టిక్ టాక్ బ్యాన్‌.. అటు చైనా కంపెనీల‌తో భారీ డీల్‌

చైనాకు ఆదాయం తెచ్చి పెట్ట‌డంతో పాటు మ‌న డేటాను ఆ దేశానికి అందిస్తున్నాయ‌న్న అనుమానాల‌తో ఒకేసారి 59 చైనా యాప్‌ల‌ను నిషేధించింది కేంద్ర ప్ర‌భుత్వం. దీనిపై నిన్న‌ట్నుంచి పెద్ద ఎత్తునే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

యాప్‌ల‌ను అయితే సులువుగానే నిషేధించేశారు.. మ‌రి చైనా ఉత్ప‌త్తుల వినియోగం మాటేంటి అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. దేశంలో చైనా కంపెనీలు వేలు, ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు పెట్టాయి. ఆ దేశానికి చెందిన ఎన్నో ఉత్ప‌త్తులు వాడుతున్నాం.. మ‌రి వాటిని నియంత్రించ‌డం ఎలా అని చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు.

ఐతే దేశంలోకి చైనా పెట్టుబ‌డుల రాక ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కూడా ఏమీ ఆగ‌లేదు. చైనా యాప్స్‌ను నిషేధించ‌డానికి వారం కింద‌ట ఒక ప్ర‌ముఖ కంపెనీలోకి చైనా ఫిర్మ్ నుంచి భారీ పెట్టుబ‌డులు వ‌చ్చాయి. భార‌త వ్యాపార దిగ్గ‌జాల్లో ఒక‌రైనా అదానికి చెందిన గ్రూప్‌లోకి చైనా ఫిర్మ్ ఒక‌టి ఏకంగా 300 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబడులు పెట్టింది.

చైనా యాప్స్‌ను నిషేధించ‌డం గురించి ఓ వైపు చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. కేంద్రం ఆ నిర్ణ‌యాన్ని స‌మీక్షిస్తుండ‌గానే ఈ డీల్ జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌తలు న‌డుస్తున్న స‌మ‌యంలో వేచి చూసే ధోర‌ణి లేకుండా ఇటు అదాని గ్రూప్ పెట్టుబ‌డుల‌కు ఆహ్వానం ప‌ల‌క‌డం, చైనా ఫిర్మ్ ఆ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

ఇలా మ‌రెన్నో కంపెనీలు భారత్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు పెట్టాయి. ఇక ముందూ అవి ఆగే ప‌రిస్థితి ఏమీ క‌నిపించ‌డం లేదు. మోడీ స‌ర్కారు 2014లో అధికారంలోకి వ‌చ్చాక దేశంలో చైనా పెట్టుబ‌డులు 500 శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

20 minutes ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

30 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

2 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

3 hours ago