వణికిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రతను తగ్గించే మెడిసిన్ విడుదల చేయటం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో ప్రముఖ ఫార్మాకంపెనీ హెటిరో ఇంజెక్షన్ ను సిద్ధం చేసింది. అంతేకాదు.. దాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. కోవిఫర్ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ ఇంజెక్షన్ తో మహమ్మారి తీవ్రతను తగ్గించే వీలుందన్న మాట వినిపిస్తోంది. తాము మార్కెట్లోకి విడుదల చేసిన కోవిఫర్ ఇంజెక్షన్ కు సంబంధించిన వివరాల్ని హెటిరో తన ప్రకటనలో వెల్లడించింది.
కోవిడ్ 19పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ యాంటీ వైరల్మెడిసిన్ ఉత్పత్తి.. మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి పొందినట్లు పేర్కొంది. రిమ్డిసివిర్ హెటిరో జెనిరిక్ వెర్షన్ కు కోవిఫర్ పేరును పెట్టినట్లు చెప్పిన కంపెనీ.. దీన్ని తాము మార్కెట్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఇంజెక్షన్ ను లక్ష డోసుల మేర సిద్ధం చేసినట్లు పేర్కొన్న కంపెనీ.. దీని ధర ఎంత ఉంటుందన్న విషయాన్ని వెల్లడించలేదు. దీన్ని ఏ రీతిలో ఉపయోగించాలి? ఎంత డోస్ ఇవ్వాలన్న దానిపై వైద్యుల సూచనల మేరకు వ్యవహరించాలని చెబుతున్నారు. మహమ్మారి తీవ్రతను తగ్గించటంలో తాజా ఇంజెక్షన్ కీలకభూమిక పోషించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 21, 2020 4:33 pm
https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA రెగ్యులర్ కాన్సెప్ట్స్ జోలికి వెళ్లకుండా విభిన్నంగా ట్రై చేసే హీరోగా సుహాస్ కి మంచి గుర్తింపు ఉంది. ఒక్కో…
విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారా…
రెండేళ్ల నిరీక్షణకు తగ్గట్టు టిల్లు స్క్వేర్ రూపంలో అద్భుత ఫలితం అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో…
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం…
సినిమా విడుదల ప్లానింగ్ సమయంలో పోటీ ఎంత ఉందనేది చూసుకోవడం చాలా ముఖ్యం. ఊరికే డేట్ వేసుకున్నామని తొందరపడితే బ్రేక్…
శాసనసభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నది. నాలుగు నెలల కాంగ్రెస్ వైఫల్యాలను…