వణికిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రతను తగ్గించే మెడిసిన్ విడుదల చేయటం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో ప్రముఖ ఫార్మాకంపెనీ హెటిరో ఇంజెక్షన్ ను సిద్ధం చేసింది. అంతేకాదు.. దాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. కోవిఫర్ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ ఇంజెక్షన్ తో మహమ్మారి తీవ్రతను తగ్గించే వీలుందన్న మాట వినిపిస్తోంది. తాము మార్కెట్లోకి విడుదల చేసిన కోవిఫర్ ఇంజెక్షన్ కు సంబంధించిన వివరాల్ని హెటిరో తన ప్రకటనలో వెల్లడించింది.
కోవిడ్ 19పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ యాంటీ వైరల్మెడిసిన్ ఉత్పత్తి.. మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి పొందినట్లు పేర్కొంది. రిమ్డిసివిర్ హెటిరో జెనిరిక్ వెర్షన్ కు కోవిఫర్ పేరును పెట్టినట్లు చెప్పిన కంపెనీ.. దీన్ని తాము మార్కెట్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఇంజెక్షన్ ను లక్ష డోసుల మేర సిద్ధం చేసినట్లు పేర్కొన్న కంపెనీ.. దీని ధర ఎంత ఉంటుందన్న విషయాన్ని వెల్లడించలేదు. దీన్ని ఏ రీతిలో ఉపయోగించాలి? ఎంత డోస్ ఇవ్వాలన్న దానిపై వైద్యుల సూచనల మేరకు వ్యవహరించాలని చెబుతున్నారు. మహమ్మారి తీవ్రతను తగ్గించటంలో తాజా ఇంజెక్షన్ కీలకభూమిక పోషించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 21, 2020 4:33 pm
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…