టిక్ టాక్ యాప్ మనుషుల్లోని సున్నితత్వాన్ని చంపేస్తోందని.. పశు ప్రవృత్తిని రెచ్చగొడుతోందని.. దీని వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని కొంత కాలంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ యాప్లో కొందరి చర్యలు చూస్తే షాకవ్వక తప్పదు.
అమ్మాయి కాదంటే యాసిడ్ పోయాలన్న సంకేతాన్నిచ్చే వీడియోతో మొదలుపెడితే.. ఎన్నో నెగెటివ్ థాట్స్ను ప్రమోట్ చేసే వీడియోలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనుషుల విపరీత ప్రవర్తనకు ఎన్నో టిక్ టాక్ వీడియోలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
తాజాగా టిక్ టాక్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న ఓ కుర్రాడు.. తాను ప్రేమించిన అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆ అమ్మాయిని చంపేశాడు. ఈ విషయంలో అతను ముందే టిక్ టాక్ ద్వారా సంకేతాలు కూడా ఇవ్వడం గమనార్హం.
ఆ టిక్ టాక్ స్టార్ పేరు.. షేర్ ఖాన్ చౌదురి. అతడికి టిక్టాక్లో ఏకంగా 4 లక్షల ఫాలోవర్లున్నారు. అతను నైనా కౌర్ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టం లేదు. ఇతడిది వన్ సైడ్ లవ్. జూన్ 22న నైనా పెళ్లి జరగబోతోందని షేర్ ఖాన్కు తెలిసింది. వెళ్లి నైనాతో ఏం మాట్లాడాడో.. ఆమె ఏమందో కానీ.. కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు. ఆమె ప్రాణాలు విడిచింది. షేర్ ఖాన్ జాడ తెలియట్లేదు.
ఈ దారుణానికి పాల్పడటానికి ముందు రోజు షేర్ ఖాన్ ఒక వీడియో పెట్టాడు. అందులో కంప్యూటర్ కీబోర్డు మీద రింగు పెట్టి పై నుంచి ఒక్కో అక్షరం మీదుగా.. కిందికి వచ్చి.. ‘ఎన్’ అనే అక్షరం దగ్గర ఆగి దాని మీద రింగ్ పెట్టాడు. ఇది నైనాను ఉద్దేశించి చేసిన వీడియోనే అని స్పష్టంగా అర్థమవుతోంది. రింగ్ ‘ఎన్’ అనే అక్షరం మీద పెట్టడం ద్వారా ఆమెతో ఎంగేజ్మెంట్ అయినట్లు ఊహించుకున్నాడా.. లేక ఆమెను చంపబోతున్నట్లు సంకేతం ఇచ్చాడా అన్నది తెలియడం లేదు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…