టిక్ టాక్ యాప్ మనుషుల్లోని సున్నితత్వాన్ని చంపేస్తోందని.. పశు ప్రవృత్తిని రెచ్చగొడుతోందని.. దీని వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని కొంత కాలంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ యాప్లో కొందరి చర్యలు చూస్తే షాకవ్వక తప్పదు.
అమ్మాయి కాదంటే యాసిడ్ పోయాలన్న సంకేతాన్నిచ్చే వీడియోతో మొదలుపెడితే.. ఎన్నో నెగెటివ్ థాట్స్ను ప్రమోట్ చేసే వీడియోలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనుషుల విపరీత ప్రవర్తనకు ఎన్నో టిక్ టాక్ వీడియోలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
తాజాగా టిక్ టాక్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న ఓ కుర్రాడు.. తాను ప్రేమించిన అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆ అమ్మాయిని చంపేశాడు. ఈ విషయంలో అతను ముందే టిక్ టాక్ ద్వారా సంకేతాలు కూడా ఇవ్వడం గమనార్హం.
ఆ టిక్ టాక్ స్టార్ పేరు.. షేర్ ఖాన్ చౌదురి. అతడికి టిక్టాక్లో ఏకంగా 4 లక్షల ఫాలోవర్లున్నారు. అతను నైనా కౌర్ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టం లేదు. ఇతడిది వన్ సైడ్ లవ్. జూన్ 22న నైనా పెళ్లి జరగబోతోందని షేర్ ఖాన్కు తెలిసింది. వెళ్లి నైనాతో ఏం మాట్లాడాడో.. ఆమె ఏమందో కానీ.. కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు. ఆమె ప్రాణాలు విడిచింది. షేర్ ఖాన్ జాడ తెలియట్లేదు.
ఈ దారుణానికి పాల్పడటానికి ముందు రోజు షేర్ ఖాన్ ఒక వీడియో పెట్టాడు. అందులో కంప్యూటర్ కీబోర్డు మీద రింగు పెట్టి పై నుంచి ఒక్కో అక్షరం మీదుగా.. కిందికి వచ్చి.. ‘ఎన్’ అనే అక్షరం దగ్గర ఆగి దాని మీద రింగ్ పెట్టాడు. ఇది నైనాను ఉద్దేశించి చేసిన వీడియోనే అని స్పష్టంగా అర్థమవుతోంది. రింగ్ ‘ఎన్’ అనే అక్షరం మీద పెట్టడం ద్వారా ఆమెతో ఎంగేజ్మెంట్ అయినట్లు ఊహించుకున్నాడా.. లేక ఆమెను చంపబోతున్నట్లు సంకేతం ఇచ్చాడా అన్నది తెలియడం లేదు.
This post was last modified on June 20, 2020 12:46 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…