Trends

బీసీసీఐ కోహ్లి అభిమానుల‌కు భ‌య‌ప‌డిందా?

కొన్ని నెల‌ల్లో భార‌త క్రికెట్లో ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. కొన్నేళ్లుగా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్ల‌లో జ‌ట్టును న‌డిపిస్తున్న విరాట్ కోహ్లి.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ప‌గ్గాలు వ‌దిలేశాడు. ముందుగా త‌న‌కు తానుగా టీ20 సార‌థ్యాన్ని విడిచిపెట్ట‌గా.. బీసీసీఐ, సెల‌క్ట‌ర్లు అత‌డిని వ‌న్డే కెప్టెన్‌గా త‌ప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో హ‌ర్ట‌యిన కోహ్లి టెస్టు కెప్టెన్సీని కూడా వ‌దిలిపెట్టేశాడు. ఇది అత‌డి అభిమానుల‌కు ఏమాత్రం రుచించ‌లేదు.

కోహ్లి లాంటి దిగ్గ‌జ ఆట‌గాడికి స‌రైన స‌మాచారం ఇవ్వ‌కుండా వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దీని వెనుక బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌భ్ గంగూలీ ఉన్నాడంటూ అత‌డిపై మండిప‌డ్డారు. కోహ్లి టెస్టు సార‌థ్యాన్ని విడిచిపెట్టిన‌పుడు బీసీసీఐ, గంగూలీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రిగింది సోష‌ల్ మీడియాలో. క‌ట్ చేస్తే ఇప్పుడు విరాట్ కోహ్లి వందో టెస్టు మైలురాయి ముంగిట నిలిచాడు. శుక్ర‌వార‌మే ఈ ప్ర‌త్యేక మ్యాచ్ మొహాలిలో ఆరంభం కాబోతోంది. శ్రీలంక‌తో జ‌ర‌గ‌బోయే ఈ మ్యాచ్‌కు అభిమానులను అనుమ‌తించ‌కూడ‌ద‌ని బీసీసీఐ నిర్ణ‌యించ‌డం దుమారం రేపింది.

బెంగ‌ళూరులో జ‌రిగే రెండో టెస్టుకు మాత్రం అభిమానుల‌ను అనుమ‌తించి, దీనికి ముందు కోల్‌క‌తాలో జ‌రిగిన టీ20 సిరీస్‌కు కూడా ప్రేక్ష‌కుల‌కు ప‌చ్చ జెండా ఊపి కేవ‌లం కోహ్లి వందో టెస్టుకు మాత్రం అభిమానుల‌ను దూరం పెట్ట‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి సోష‌ల్ మీడియాలో. ఒక రోజంతా దీనిపై ట్విట్ట‌ర్లో చ‌ర్చ జ‌రిగింది. బీసీసీఐని, గంగూలీని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు కోహ్లి అభిమానులు.

ఈ ట్రోలింగ్ అంతా చూశాక బీసీసీఐ జ‌డుసుకున్న‌ట్లే ఉంది. కోహ్లి వందో టెస్టుకు అభిమానుల‌ను అనుమ‌తిస్తామ‌ని ప్ర‌క‌టించారు. 50 శాతం ఆక్యుపెన్సీ మ‌ధ్య ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్రేక్ష‌కులుంటే మ‌రింత ఉత్సాహంగా ఆడే కోహ్లికి ఇది సానుకూల విష‌య‌మే. మ‌రి అభిమానుల మ‌ధ్య వందో టెస్టులో వంద కొట్టి రెండేళ్ల‌కు పైగా సాగుతున్న నిరీక్ష‌ణ‌కు కోహ్లి తెర‌దించుతాడేమో చూడాలి.

This post was last modified on March 3, 2022 9:49 am

Share

Recent Posts

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

2 minutes ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

2 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

3 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

8 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

11 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

11 hours ago