ఆర్ధిక నేరగాళ్ళ బుద్ధి ఎక్కడున్న ఒకే పద్ధతిలో ఉంటుంది. ఒక దేశంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం, మరో దేశంలో తీసుకున్న అప్పులను చెల్లించటం అంటు ఉండదని తాజాగా నిరూపణైంది. దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుని పారిపోయిన విజయమాల్య వ్యవహారం ఒకటి తాజాగా వెలుగు చూసింది. మాల్యా ఆస్తుల విషయంలో లండన్ కోర్టు ఇచ్చిన తీర్పే ఆయన వైఖరికి నిదర్శనంగా మారింది.
విషయం ఏమిటంటే మనదేశంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా లండన్లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. లండన్లో కూడా ఈయన గారు వ్యాపారం చేస్తున్నారు. ఈయనకు చెందిన రోజ్ వెంచర్ క్యాపిటిల్ సంస్ధ మాల్యా కుటుంబానికి చెందిన ఒక భవనాన్ని కుదువపెట్టి యూబీఎస్ అనే సంస్థ నుంచి భారీగా అప్పు తీసుకుంది. కార్నివాల్ టెరాస్ అనే కాంపౌండ్ లో లక్షల పౌండ్లు విలువచేసే అపార్ట్ మెంటు ఉందట.
దీన్ని తనఖా పెట్టిన మాల్యా కుటుంబం తిరిగి అప్పు చెల్లించలేదు. దాంతో అప్పిచ్చిన సంస్ధ కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన కోర్టు అప్పు చెల్లించాలని, లేదా అపార్ట్ మెంటును వదులుకోవాలని 2019లోనే తీర్పు చెప్పింది. అయితే కోర్టు తీర్పును మాల్యా పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సదరు సంస్ధ తాజాగా కోర్టు ధిక్కారం కేసు వేసింది. దాంతో కోర్టుకు హాజరైన మాల్యా రుణాలు చెల్లించలేకపోవటానికి కరోనా వైరస్ అని అదని ఇదని కారణాలను చూప్పారు.
అయితే మాల్యా చెప్పిన కారణాల్లో దేన్ని కూడా నమ్మలేదు. అందుకనే వెంటనే అప్పు కింద అపార్ట్ మెంటును స్వాధీనం చేసుకోమని యూబీఎస్ సంస్ధకు అనుకూలంగా తీర్పుచెప్పింది. అంటే వెంటనే సదరు సంస్ధ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు కూడా మొదలుపెట్టేసింది. ఇపుడా అపార్ట్ మెంటులో మాల్యా తల్లి లలిత ఉంటున్నారు. ఎవరున్నా తమకు అనవసరమని స్వాధీన చర్యలు మొదలుపెట్టేసింది సదరు సంస్ధ. భారత్ లో ఆడినట్లు ఎంత కాలమైనా ఆడచ్చని మాల్యా అనుకున్నట్లున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…