Trends

మాల్యాకు లండన్ కోర్టు షాక్

ఆర్ధిక నేరగాళ్ళ బుద్ధి ఎక్కడున్న ఒకే పద్ధతిలో ఉంటుంది. ఒక దేశంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం, మరో దేశంలో తీసుకున్న అప్పులను చెల్లించటం అంటు ఉండదని తాజాగా నిరూపణైంది. దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుని పారిపోయిన విజయమాల్య వ్యవహారం ఒకటి తాజాగా వెలుగు చూసింది. మాల్యా ఆస్తుల విషయంలో లండన్ కోర్టు ఇచ్చిన తీర్పే ఆయన వైఖరికి నిదర్శనంగా మారింది.

విషయం ఏమిటంటే మనదేశంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా లండన్లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. లండన్లో కూడా ఈయన గారు వ్యాపారం చేస్తున్నారు.  ఈయనకు చెందిన రోజ్ వెంచర్ క్యాపిటిల్ సంస్ధ మాల్యా కుటుంబానికి చెందిన ఒక భవనాన్ని కుదువపెట్టి యూబీఎస్ అనే సంస్థ నుంచి భారీగా అప్పు తీసుకుంది. కార్నివాల్ టెరాస్ అనే కాంపౌండ్ లో లక్షల పౌండ్లు విలువచేసే అపార్ట్ మెంటు ఉందట.

దీన్ని తనఖా పెట్టిన మాల్యా కుటుంబం తిరిగి అప్పు చెల్లించలేదు. దాంతో అప్పిచ్చిన సంస్ధ కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన కోర్టు అప్పు చెల్లించాలని, లేదా అపార్ట్ మెంటును వదులుకోవాలని 2019లోనే  తీర్పు చెప్పింది.  అయితే కోర్టు తీర్పును మాల్యా పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సదరు సంస్ధ తాజాగా కోర్టు ధిక్కారం కేసు వేసింది. దాంతో కోర్టుకు హాజరైన మాల్యా రుణాలు చెల్లించలేకపోవటానికి కరోనా వైరస్ అని అదని ఇదని కారణాలను చూప్పారు.

అయితే మాల్యా చెప్పిన కారణాల్లో దేన్ని కూడా నమ్మలేదు. అందుకనే వెంటనే అప్పు కింద అపార్ట్ మెంటును స్వాధీనం చేసుకోమని యూబీఎస్ సంస్ధకు అనుకూలంగా తీర్పుచెప్పింది. అంటే వెంటనే సదరు సంస్ధ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు కూడా మొదలుపెట్టేసింది. ఇపుడా అపార్ట్ మెంటులో మాల్యా తల్లి లలిత ఉంటున్నారు. ఎవరున్నా తమకు అనవసరమని స్వాధీన చర్యలు మొదలుపెట్టేసింది సదరు సంస్ధ. భారత్ లో ఆడినట్లు ఎంత కాలమైనా ఆడచ్చని మాల్యా అనుకున్నట్లున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on January 19, 2022 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ విష‌యంలో జ‌గ‌న్ మౌనం.. రీజ‌నేంటి..!

తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్‌ పై అన్ని వ‌ర్గాలు స్పందించాయి. రాజ‌కీయ వ‌ర్గాల నుంచి పారిశ్రామిక వ‌ర్గాల…

3 minutes ago

బన్నీ ఆబ్సెంట్ – ఒక ప్లస్సు ఒక మైనస్సు

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన…

7 minutes ago

చంద్రబాబు భూమికే ఎసరు పెట్టేశారే!

వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…

2 hours ago

ఈ చిన్ని పండు వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…

4 hours ago

స‌ల‌హాదారులు వ‌చ్చేస్తున్నారు.. బాబు తాంబూలం వారికే.. !

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారు ఇప్ప‌టి వ‌ర‌కు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో సీఎం విచ‌క్ష‌ణ…

8 hours ago

విజ‌య వార‌ధి రెడ్డి.. విజ‌య‌మ్మ ఎంట్రీ..?

"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయ‌న మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుప‌డుతున్నా" ఓ 15 ఏళ్ల కింద‌ట క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన రాజ‌కీయం…

9 hours ago