Trends

బార్లు తెరిచి స్కూళ్లు మూసేస్తారా?

కరోనా సహా వాటి కొత్త వేరియంట్‌ల పుట్టుక వల్ల పాఠశాలలను మూసివేయడాన్ని ప్రస్తుతానికి సమర్థించుకోలేమని ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్‌ జేమీ సావ్‌ద్రా అన్నారు. ప్రపంచ విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం చేస్తున్న ఆయన.. కొత్త కొవిడ్ వేరియంట్లు వస్తే పాఠశాల మూసివేతను చివరి మార్గంగా అనుసరించాలని సూచించారు. పాఠశాలలు సురక్షితంగా లేకపోవడం సహా తిరిగి తెరిస్తే కరోనా కేసులు పెరుగుతాయన్న విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. పాఠశాలలను తెరవడానికి, కరోనా వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదని జేమీ సావ్‌ద్రా వివరించారు.

బార్లు, రెస్టారెంట్‌లు, షాపింగ్‌ మాళ్లను తెరిచి, పాఠశాలలను మూసివేయడంలో అర్థం లేదన్నారు. దీన్ని క్షమించలేమని పేర్కొన్నారు. పాఠశాలలను తెరిచినా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం తక్కువే అని తమ అధ్యయనాల్లో తేలిందని వివరించారు. పాఠశాలల మూసివేత వల్ల భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వెల్లడించారు. పిల్లలకు టీకాలు వేసిన తర్వాతే పాఠశాలలను తిరిగి తెరవాలనే నిబంధనను ఏ దేశంలోనూ లేదని.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని పేర్కొన్నారు.

2020కు సంబంధించి “బీటెన్ లేదా బ్రోకెన్? ఇన్ఫార్మాలిటీ, దక్షిణాసియాలో కరోనా” పేరుతో ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం ఓ నివేదికను రూపొందించింది. దేశంలో కరోనా కారణంగా పాఠశాలలను దీర్ఘకాలికంగా మూసివేయడం వల్ల భవిష్యత్తులో 400 బిలియన్ డాలర్లకు మించిన‌ నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఫలితంగా వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయితే, పాఠ‌శాల‌ల‌ను మాత్రం మూసేయొద్ద‌ని ప్ర‌పంచ బ్యాంకు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 16, 2022 10:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వ్యాపార సంస్క‌ర్త‌-2025’: చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’ (వ్యాపార సంస్క‌ర్త‌-2025)కు ఆయ‌న ఎంపిక‌య్యారు.…

40 seconds ago

కొడాలి రీప్లేస్.. ఖాయమంటున్న కేడర్..!

కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…

18 minutes ago

నేరుగా వంటింటికే.. రైతు బజార్!

డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…

51 minutes ago

బాబు గారి పాలన… అంతా లైవ్ లోనే!

సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…

2 hours ago

డెకాయిట్… డిఫరెంట్ అనిపిస్తున్నాడు

అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…

2 hours ago

చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’ (వ్యాపార సంస్క‌ర్త‌-2025)కు ఆయ‌న ఎంపిక‌య్యారు.…

2 hours ago