మరో ఆరురోజుల్లో న్యూ ఇయర్ 2022 వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం షాకిచ్చింది. న్యూ ఇయర్ వేడుకలను అట్టహాసంగా చేసుకునేందుకుఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అదేవిధంగా ర్యాలీలు, ప్లబ్బులు, క్లబ్బులను కూడా ఆ రోజు తర్వాత రెండు రోజుల పాటు మూసేయనున్నట్టు తెలిపింది. ప్రజలు ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించుకోరాదని స్పష్టం చేసింది.
దీనికి కారణం.. ప్రపంచాన్ని ఒణికిస్తున్న ఒమిక్రాన్! ప్రస్తుతం తెలంగాణలోనూ ఈ వేరియెంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణా చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణా చట్టం కింద ఆంక్షలు అమలు చేయనుంది.
వచ్చే నెల(జనవరి-2022) రెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించారు. కొన్ని నియంత్రణా చర్యలతో జనసమూహం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ప్రవేశద్వారాల థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించే విషయమై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఆ ఉత్తర్వు ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తాజా ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. గత ఏడాది కూడా ఇదే ఆదేశాలతో నూతన సంవత్సర వేడుకలకు దూరమైన ప్రజలు.. ఇప్పుడు కూడా దూరం కావడంపై సర్వత్రా నిరాస ఎదురవుతుండడం గమనార్హం.
This post was last modified on December 25, 2021 7:51 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…