Trends

పిల్లలతో విదేశాలకు ఎందుకు వెళుతున్నారంటే?

ఈమధ్య మనదేశం నుండి రెగ్యులర్ గా కొందరు విదేశాలకు వెళుతున్నారు. మనదేశం నుండి విదేశాలకు వెళ్ళటం మామూలే. కానీ కొద్ది రోజులుగా పిల్లలను తీసుకుని తల్లి, దండ్రులు మరీ విదేశాలకు వెళ్ళొస్తున్నారట. నెల రోజుల ట్రిప్పులకైనా సరే తక్కువలో తక్కువ రు. 3 లక్షల రూపాయలకు పైగానే ఖర్చు చేస్తున్నారట. ఎందుకిలా పిల్లలతో వెళ్ళి అంతంత డబ్బు ఖర్చులు పెట్టుకుని వస్తున్నారు ? ఎందుకంటే కరోనా వైరస్ భయంతోనేనట.

మనదేశంలో చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన రాకపోయినా స్కూళ్ళు మాత్రం తెరిచేశారు. ఇష్టం ఉన్నవాళ్ళు స్కూళ్ళకు రావచ్చని స్కూళ్ళ యాజమాన్యాలు చెబుతున్నా పిల్లలు ధైర్యంచేసి స్కూళ్ళకు వచ్చేస్తుండటంతో పేరంట్సులో కరోనా వైరస్ భయం పెరిగిపోతోందట. దానికితోడు కొద్దిరోజులుగా ఒమిక్రాన్ విజృంభణ ఒకటి. దాంతో డబ్బులు ఖర్చు చేసుకోగలిగిన వాళ్ళు తమ పిల్లలను తీసుకుని విదేశాలకు వెళ్ళి వ్యాక్సిన్ వేయించేస్తున్నారు.

అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్, ఫ్రాన్స్, సింగపూర్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో చిన్న పిల్లలకు కోవిడ్ టీకాలు చాలా కాలంగా వేస్తున్నారు. పైగా చాలా దేశాల్లో మనదేశంలో ఉన్నంత డిమాండ్ కూడా టీకాలకు లేదు. దాంతో టీకాలు వేయించుకోవాలని అనుకునేవాళ్ళకు చాలా తేలిగ్గానే దొరొకేస్తోంది. అందుకనే సంపన్నులు తమ పిల్లలను తీసుకుని ఓ నెల రోజులు సరదగా గడిపినట్లుంటుంది అలాగే టీకాలు వేయించేసినట్లుంటుందని విదేశాలకు వెళ్ళిపోతున్నారు.

విదేశాల్లోనే టీకాలు వేయించిన తర్వాత అబ్జర్వేషన్ కోసం అక్కడే కొద్దిరోజులుంటున్నారు. పనిలోపనిగా సైట్ సీయింగ్ కూడా కానిచ్చేస్తున్నారు. అంటే ఒకే దెబ్బకు మూడు పిట్టలన్నట్లుగా. ఇక మూడో పిట్టకూడా ఉందట. అదేమిటంటే ఇప్పటికే రెండు డోసులు వేసుకున్న పెద్దవాళ్ళు  బూస్టర్ డోసు కింద మూడో డోసు కూడా వేయించేసుకుంటున్నారట. మరి మనదగ్గర చిన్న పిల్లలకు టీకాలు వేయించే విషయంలో ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో, వ్యాక్సిన్ ఎప్పుడు రెడీ అవుతుందో అని అందరు ఎదురు చూస్తున్నారు. అప్పటివరకు విదేశాలే గతేమో.

Satya

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

3 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

3 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

5 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

5 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

5 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

6 hours ago