టీ20 ప్రపంచకప్లో ఘోర వైఫల్యం తాలూకు జ్ఞాపకాలు భారత అభిమానుల మెదళ్లలో మెదులుతుండగానే.. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా న్యూజిలాండ్తో సిరీస్ మొదలుపెట్టేసింది టీమ్ ఇండియా. ముందుగా ఆ జట్టుతో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి అభిమానులకు ఊరటనిచ్చింది. ప్రపంచకప్లో భారత్ను ఓడించడమే కాక.. ఫైనల్ వరకు వెళ్లిన జట్టుతో వెంటనే సిరీస్ ఆడి క్లీన్ స్వీప్ చేయడం గొప్ప విషయమే. అంతటితో ఆగకుండా ఇప్పుడు టెస్టు సిరీస్లోనూ జయకేతనం ఎగురవేసింది భారత్.
తొలి టెస్టులో త్రుటిలో విజయాన్ని చేజార్చుకుని, డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. రెండో టెస్టులో మాత్రం పట్టు వదల్లేదు. న్యూజిలాండ్ను 372 పరుగుల భారీ తేడాతో ఆ జట్టును మట్టి కరిపించింది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 62 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో అనూహ్యమైన విషయాలు చాలానే జరిగాయి. భారత తొలి ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు పడగొట్టి కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అరుదైన ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే.
మన జట్టుపై ప్రత్యర్థి బౌలర్ ఇలాంటి ఘనత సాధించడం కొంచెం ఇబ్బంది పెట్టేదే అయినా.. ఆ రికార్డు అందుకుంది భారత సంతతికి చెందిన వాడే కావడం, తను పుట్టిన ముంబయిలోనే ఈ ఘనత సాధించడం సానుకూల విషయమే. ఇంకో అరుదైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్లో వికెట్లు పడగొట్టిన ప్రతి ఒక్కరూ ఇండియన్సే కావడం విశేషం. భారత జట్టులో ఉన్నవాళ్లందరూ భారతీయులే కాబట్టి ఇక్కడ లెక్కలేమీ చూడాల్సిన పని లేదు. కానీ న్యూజిలాండ్ తరఫున మ్యాచ్లో వికెట్లు పడగొట్టిన వాళ్లు కూడా బేసిగ్గా భారతీయులే కావడం విశేషం.
భారత్ తొలి ఇన్నింగ్స్లో వికెట్లన్నీ అజాజ్ ఖాతాలో చేరగా.. రెండో ఇన్నింగ్స్లో అతను 4 వికెట్లు తీశాడు. భారత్ కోల్పోయిన ఇంకో మూడు వికెట్లు రచిన్ రవీంద్ర తీశాడు. అతను కూడా భారత సంతతికి చెందిన వాడే. ఇంకో విశేషం ఏంటంటే.. అజాజ్ పటేల్లోని ‘పటేల్’ అనే పేరు మన జట్టులో అక్షర్ పటేల్తో కలుస్తోంది. అలాగే రచిన్ రవీంద్రలోని రవీంద్ర పేరు.. రవీంద్ర జడేజాతో కనెక్షన్ కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నలుగురూ కలిసి వెనుక తమ పేర్లు కనిపించేలా ఫొటోలకు పోజు ఇవ్వగా.. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on December 6, 2021 6:02 pm
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…