Trends

ఒమైక్రాన్ టెన్షన్ పెరుగుతోందే

దేశాన్ని ఇపుడు ఒమైక్రాన్ వేరియంట్ వణికించేస్తోంది. గడచిన ఏడాదిన్నరగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ తగ్గిపోతోంది కదాని రిలాక్సుడుగా ఉంటే హఠాత్తుగా ఒమైక్రాన్ విరుచుకుపడుతోంది. కరోనా వైరస్ కన్నా పదిరెట్లు ప్రమాధకరమైన కొత్త వేరియంట్ తో ఇప్పటికే 35 దేశాలు వణికిపోతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి విదేశాలకు వెళ్ళిన వారిని వెతికి పట్టుకోవడం, పరీక్షలు నిర్వహించడం, అంతవరకు వారిని క్వారంటైన్ సెంటర్లలో పెట్టడం ఇపుడు పెద్ద సమస్యగా మారిపోయింది.

ఒమైక్రాన్ మొదట గుర్తించింది దక్షణాఫ్రికాలోనే కాబట్టి ఆ దేశానికి చాలా దేశాలు విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి. అయితే అప్పటికే దక్షిణాఫ్రికా నుండి వివిధ దేశాల్లోకి ప్రవేశించిన వారి కోసం ఆయా దేశాలు వెతుకుతున్నాయి. ఇందులో భాగంగానే మనదేశంలోకి కూడా చాలామందే దిగారు. ఇపుడు వీరందరిని ట్రేస్ చేసేపనిలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21 ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీటిలో రాజస్థాన్ లోని జైపూర్ లోనే 9 కేసులు బయటపడటంతో రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

జైపూర్లో బయటపడిన తొమ్మిది కేసుల్లో నలుగురు ఒక మ్యారేజీకి హాజరవ్వటంతో అధికారుల్లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది. వీరి అంచనా ప్రకారం మ్యారేజిలకు హాజరైన వారిలో ఒమైక్రాన్ కేసులు ఎన్ని బయటపడతాయో చూడాలి. వీళ్ళు కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, బెంగళూరు, ఢిల్లీలో కూడా ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఒమైక్రాన్ సోకిన వారి ఆరోగ్య పరిస్ధితి, వ్యాధి లక్షణాల్లో నిర్దిష్ట లక్షణాలేవీ నిపుణులు చెప్పటం లేదు. ఎందుకంటే ఒక్కో నిపుణుడు ఒక్కో విధంగా చెబుతుండటంతో మామూలు జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.

ఒకవైపు ఒమైక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం టెన్షన్ పడుతుంటే మరోవైపు కరోనా వైరస్ కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి.  తెలంగాణాలోని కరీంనగర్ మెడికల్ కాలేజీలోనే 43 మందికి కరోనా వైరస్ నిర్ధారణవ్వటంతో కాలేజీని అర్ధాంతరంగా మూసేశారు. అలాగే కొన్ని ఆశ్రమ స్కూళ్ళల్లోని విద్యార్ధులకు కూడా కరోనా పాజిటివ్ బయటపడింది. దీంతో కేసులు బయటపడిన విద్యాసంస్ధలను ప్రభుత్వం మూయించేస్తోంది. దీనికితోడు జనవరి-ఫిబ్రవరిలో మూడో వేవ్ రావచ్చని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ చేసిన ప్రకటన టెన్షన్ పెంచేస్తోంది.

This post was last modified on December 6, 2021 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

21 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago