Trends

ట్రైన్ ఆలస్యం..రైల్వే శాఖకు షాకిచ్చిన ప్యాసింజర్..!

మనం ఎక్కాల్సిన రైలు అప్పుడప్పుడు రావాల్సిన సమయం కన్నా.. లేటుగా రావడం చాలా మంది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే.. రైలు ఆలస్యమైతే ఏం చేస్తాం..? అది వచ్చే వరకు ఎదురు చూస్తాం. అయితే.. ఓ ప్రయాణికుడు మాత్రం ఊరుకోలేదు. రైలు ఆలస్యంగా రావడం వల్ల తనకు జరిగిన నష్టాన్ని.. వడ్డీతో సహా రాబట్టుకునేలా చేశాడు. ఈ సంఘటన మన దేశంలోనే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జ‌మ్మూ కాశ్మీర్‌కు చెందిన సంజ‌య్ శుక్లా కుటుంబం జ‌మ్మూ నుంచి శ్రీన‌గ‌ర్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంది. తాముండే ప్రాంతం నుంచి జ‌మ్మూ వెళ్లేందుకు అజ్మీర్, జ‌మ్మూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్ర‌యాణించారు. అయితే ఉదయం 8.10 గంటలకు జ‌మ్మూ చేరుకోవాల్సిన రైలు కాస్తా.. 4 గంట‌ల ఆల‌స్యంతో మ‌ధ్యాహ్నం 12 గంటలకు వెళ్లింది.

దీంతో సంజ‌య్ కుటుంబం ఫ్లైట్ మిస్ అయ్యింది. అత్య‌వ‌స‌ర‌మైన ప‌ని కావ‌డంతో రూ. 15 వేలు చెల్లించి జ‌మ్మూ నుంచి శ్రీన‌గ‌ర్‌కు వెళ్లారు ఆ కుటుంబ స‌భ్యులు. ఆపై అక్క‌డ బ‌స చేయ‌డానికి రూ. 10 వేలు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింది. దీంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కేసు విచార‌ణ సంద‌ర్భంగా బాధిత కుటుంబానికి ఎలాంటి ప‌రిహారం చెల్లించాల్సి అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం వాదించింది. ఇండియ‌న్ రైల్వేస్ చ‌ట్టాల్లోనూ ఆ విష‌యం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ప్ర‌భుత్వ వాద‌న‌ల‌ను సుప్రీంకోర్టు త‌ప్పుబ‌ట్టింది. చేసిందే త‌ప్పు.. ఆపై చ‌ట్టాల పేరుతో క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ మంద‌లించింది. ఘ‌ట‌న జ‌రిగిన నాటి నుంచి లెక్కిస్తూ.. బాధిత కుటుంబానికి రూ. 30 వేల ప‌రిహారాన్ని వ‌డ్డీతో చెల్లించాల‌ని ఆదేశించింది. రైళ్ల‌ను ఆల‌స్యంగా న‌డిపిస్తే.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల‌తో ఎలా పోటీప‌డ‌తార‌ని కూడా సుప్రీంకోర్టు ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించింది.

This post was last modified on September 9, 2021 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

2 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

2 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

5 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

6 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

6 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

8 hours ago