Trends

ట్రైన్ ఆలస్యం..రైల్వే శాఖకు షాకిచ్చిన ప్యాసింజర్..!

మనం ఎక్కాల్సిన రైలు అప్పుడప్పుడు రావాల్సిన సమయం కన్నా.. లేటుగా రావడం చాలా మంది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే.. రైలు ఆలస్యమైతే ఏం చేస్తాం..? అది వచ్చే వరకు ఎదురు చూస్తాం. అయితే.. ఓ ప్రయాణికుడు మాత్రం ఊరుకోలేదు. రైలు ఆలస్యంగా రావడం వల్ల తనకు జరిగిన నష్టాన్ని.. వడ్డీతో సహా రాబట్టుకునేలా చేశాడు. ఈ సంఘటన మన దేశంలోనే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జ‌మ్మూ కాశ్మీర్‌కు చెందిన సంజ‌య్ శుక్లా కుటుంబం జ‌మ్మూ నుంచి శ్రీన‌గ‌ర్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంది. తాముండే ప్రాంతం నుంచి జ‌మ్మూ వెళ్లేందుకు అజ్మీర్, జ‌మ్మూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్ర‌యాణించారు. అయితే ఉదయం 8.10 గంటలకు జ‌మ్మూ చేరుకోవాల్సిన రైలు కాస్తా.. 4 గంట‌ల ఆల‌స్యంతో మ‌ధ్యాహ్నం 12 గంటలకు వెళ్లింది.

దీంతో సంజ‌య్ కుటుంబం ఫ్లైట్ మిస్ అయ్యింది. అత్య‌వ‌స‌ర‌మైన ప‌ని కావ‌డంతో రూ. 15 వేలు చెల్లించి జ‌మ్మూ నుంచి శ్రీన‌గ‌ర్‌కు వెళ్లారు ఆ కుటుంబ స‌భ్యులు. ఆపై అక్క‌డ బ‌స చేయ‌డానికి రూ. 10 వేలు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింది. దీంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కేసు విచార‌ణ సంద‌ర్భంగా బాధిత కుటుంబానికి ఎలాంటి ప‌రిహారం చెల్లించాల్సి అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం వాదించింది. ఇండియ‌న్ రైల్వేస్ చ‌ట్టాల్లోనూ ఆ విష‌యం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ప్ర‌భుత్వ వాద‌న‌ల‌ను సుప్రీంకోర్టు త‌ప్పుబ‌ట్టింది. చేసిందే త‌ప్పు.. ఆపై చ‌ట్టాల పేరుతో క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ మంద‌లించింది. ఘ‌ట‌న జ‌రిగిన నాటి నుంచి లెక్కిస్తూ.. బాధిత కుటుంబానికి రూ. 30 వేల ప‌రిహారాన్ని వ‌డ్డీతో చెల్లించాల‌ని ఆదేశించింది. రైళ్ల‌ను ఆల‌స్యంగా న‌డిపిస్తే.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల‌తో ఎలా పోటీప‌డ‌తార‌ని కూడా సుప్రీంకోర్టు ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించింది.

This post was last modified on September 9, 2021 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హమ్మయ్యా… పెద్ద బరువు తీరినట్టేనా

తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…

18 minutes ago

శ్రీరాములు రినోవేషన్… ఎగ్జిబిటర్ల సమాధానమా

హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…

21 minutes ago

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…

36 minutes ago

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

1 hour ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

2 hours ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

3 hours ago