‘‘ఐదు స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుస్తాం’’.. పారాలింపిక్స్కు బయల్దేరే ముందు భారత అథ్లెట్ల బృందం ఉమ్మడిగా చేసిన ప్రకటన ఇది. ఐతే ఇప్పటిదాకా భారత్ పాల్గొన్న అన్ని పారాలింపిక్స్లో కలిపి సాధించిన పతకాలు 12 మాత్రమే. అలాంటిది ఈ ఒక్కసారే 15 పతకాలు.. అందులోనూ 5 స్వర్ణాలు గెలుస్తాం అంటుంటే టూమచ్ అనే అనిపించింది చాలామందికి.
ఒలింపిక్స్, పారాలింపిక్స్ ముంగిట అథ్లెట్లు ఇలా ఘనంగా ప్రకటనలు చేయడం.. తీరా అసలు పోటీల్లోకి వెళ్లేసరికి అంచనాలకు దూరంగా నిలిచిపోవడం మామూలే కాబట్టి టోక్యోలోనూ అదే జరుగుతుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు పోటీల ముగింపు రోజు నాటికి భారత్ సాధించిన పతకాలు చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈవెంట్ ఆరంభానికి ముందు అన్నట్లే ఐదు స్వర్ణాలు సాధించారు భారత క్రీడాకారులు. ఇక ఓవరాల్ పతకాల సంఖ్య 15 కాదు.. 19కి చేరడం విశేషం.
షూటర్ అవని లేఖరా టోక్యో పారాలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందిస్తే.. ఆ తర్వాత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ దేశం ఖాతాలో రెండో పసిడి జమ చేశాడు. ఇక పోటీల ముగింపునకు ఒక్క రోజు ముందు భారత్కు రెండు స్వర్ణాలు దక్కాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్.. షూటర్ మనీష్ నర్వాల్ భారత్ను స్వర్ణ సంబరంలో ముంచెత్తారు.
ఇక పారాలింపిక్స్ చివరి రోజు బ్యాడ్మింటన్లో భారత్కు మరో బంగారు పతకం దక్కింది. కృష్ణా నగర్ ఎస్హెచ్4 విభాగంలో విజేతగా నిలిచి టోక్యో పారాలింపిక్స్లో భారత్కు తిరుగులేని ముగింపు ఇచ్చాడు.
చివరి రోజు మరో పసిడి కూడా దక్కాల్సింది కానీ.. మరో స్టార్ షట్లర్, ఐఏఎస్ అధికారి కూడా అయిన సుహాస్ యతిరాజ్ త్రుటిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్నాడు. భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తంగా 19 పతకాలు సాధించిన క్రీడల చరిత్రలోనే అత్యుత్తమంగా 24వ స్థానంలో టోక్యో పారాలింపిక్స్ను గొప్పగా ముగించింది.
This post was last modified on September 5, 2021 12:16 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…