Trends

చెప్పి మరీ కొట్టారు.. వీళ్లకు వేయాలి వీరతాడు

‘‘ఐదు స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుస్తాం’’.. పారాలింపిక్స్‌కు బయల్దేరే ముందు భారత అథ్లెట్ల బృందం ఉమ్మడిగా చేసిన ప్రకటన ఇది. ఐతే ఇప్పటిదాకా భారత్ పాల్గొన్న అన్ని పారాలింపిక్స్‌లో కలిపి సాధించిన పతకాలు 12 మాత్రమే. అలాంటిది ఈ ఒక్కసారే 15 పతకాలు.. అందులోనూ 5 స్వర్ణాలు గెలుస్తాం అంటుంటే టూమచ్ అనే అనిపించింది చాలామందికి.

ఒలింపిక్స్, పారాలింపిక్స్ ముంగిట అథ్లెట్లు ఇలా ఘనంగా ప్రకటనలు చేయడం.. తీరా అసలు పోటీల్లోకి వెళ్లేసరికి అంచనాలకు దూరంగా నిలిచిపోవడం మామూలే కాబట్టి టోక్యోలోనూ అదే జరుగుతుందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు పోటీల ముగింపు రోజు నాటికి భారత్ సాధించిన పతకాలు చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈవెంట్ ఆరంభానికి ముందు అన్నట్లే ఐదు స్వర్ణాలు సాధించారు భారత క్రీడాకారులు. ఇక ఓవరాల్ పతకాల సంఖ్య 15 కాదు.. 19కి చేరడం విశేషం.

షూటర్ అవని లేఖరా టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందిస్తే.. ఆ తర్వాత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ దేశం ఖాతాలో రెండో పసిడి జమ చేశాడు. ఇక పోటీల ముగింపునకు ఒక్క రోజు ముందు భారత్‌కు రెండు స్వర్ణాలు దక్కాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్.. షూటర్ మనీష్ నర్వాల్ భారత్‌ను స్వర్ణ సంబరంలో ముంచెత్తారు.

ఇక పారాలింపిక్స్ చివరి రోజు బ్యాడ్మింటన్లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. కృష్ణా నగర్ ఎస్‌హెచ్4 విభాగంలో విజేతగా నిలిచి టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తిరుగులేని ముగింపు ఇచ్చాడు.

చివరి రోజు మరో పసిడి కూడా దక్కాల్సింది కానీ.. మరో స్టార్ షట్లర్, ఐఏఎస్ అధికారి కూడా అయిన సుహాస్ యతిరాజ్ త్రుటిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్నాడు. భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తంగా 19 పతకాలు సాధించిన క్రీడల చరిత్రలోనే అత్యుత్తమంగా 24వ స్థానంలో టోక్యో పారాలింపిక్స్‌ను గొప్పగా ముగించింది.

This post was last modified on September 5, 2021 12:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

1 hour ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

2 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

2 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

3 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

3 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

4 hours ago