గత సంవత్సరకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు వదులుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మహమ్మారి మాత్రం కొత్త కొత్త వేరియంట్లు మార్చుకొని మరీ.. ప్రజలపై ఎటాక్ చేస్తోంది. ఈ కరోనా వైరస్ కేసుల్లో అత్యంత ప్రమాదకరమైన మ్యూటెంట్ గా నిపుణులు డెల్టా మ్యూటెంట్ ను గుర్తించారు.
ఇప్పటికే మన దేశంలో సెకండ్ వేవ్ సమయంలో ఈ మ్యూటెంట్ అధికంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. దీనివల్ల కేసుల సంఖ్య వేగంగా పెరగటంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. ఈ వేరియంట్ కు వ్యాక్సిన్ నుండి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు డెల్టా వేరియంట్ గురించి సంచలన విషయాలు భయటపెట్టారు.
ఇతర వేరియంట్ లు సోకిన దానికంటే డెల్టా వేరియంట్ బారిన పడితే వైరస్ లోడ్ 300 రెట్లు అధికంగా ఉన్నట్టు నిర్దారించారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. డెల్టా వేరియంట్ సోకిన వారిపై మరియు ఇతర వేరియంట్ ల బారిన పడిన వారిపై పరిశోధనలు జరపగా డెల్టా వేరియంట్ బారిన పడ్డ వారిలో కరోనా వైరస్ లోడ్ 300 రెట్లు అధికంగా ఉందని నిర్ధారించారు. ఇక ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
This post was last modified on August 25, 2021 10:29 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…