Trends

అభివాదం చేసి చేసీ.. నీరజ్ చోప్రాకి అస్వస్థత

నీరజ్ చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే.. ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరే వినపడుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి వందేళ్ల భారతీయుల కల నెరవేర్చిన బల్లెం వీరుడు ఈ నీరజ్‌ చోప్రా. భారతీయుల స్వర్ణం కల నెరవేర్చిన నీరజ్ చోప్రాపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా.. ఈ ఒలంపిక్ విజేత అనుకోకుండా అస్వస్థతకు గురయ్యారు.

ఢిల్లీలో ప్రధాని మోడీతో విందు అనంతరం స్వగ్రామం హర్యానాలోని పానిపట్‌ సమీపంలోని సమల్ఖాకు బయల్దేరాడు. ఢిల్లీ నుంచి పానిపట్‌ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరగా స్వగ్రామం చేరుకునేలోపు నీరజ్‌ అస్వస్థతకు గురయ్యాడు.

ఉదయం నుంచి కారు టాప్‌పై ఉండి అందరికీ అభివాదం చేస్తూ స్వర్ణ పతకం చూపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు. ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో నీరజ్‌ నీరసించిపోయాడు. హై ఫీవర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గత కొన్నిరోజులుగా నీరజ్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఈ కారణంగానే నీరజ్‌ గైర్హాజరయ్యాడు. అయితే ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాత్రం నీరజ్‌ పాల్గొన్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి మోదీని కలిసి అభినందనలు పొందాడు

మరోవైపు ఒలింపిక్స్‌ లో గోల్డ్ మెడల్ సాధించి తొలిసారి స్వగ్రామం సమల్ఖాకు వెళ్లిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. పిండిపదార్థాలు ప్రత్యేకంగా తయారుచేశారు. ఆయనకు ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్‌ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో అనారోగ్యం పాలయ్యాడు.

This post was last modified on August 18, 2021 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ నిబద్ధతకు అద్దం పట్టిన ‘బాట’ వీడియో

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…

7 minutes ago

బాషా ఫ్లాష్ బ్యాక్ : ముఖ్యమంత్రితో వివాదం

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…

14 minutes ago

భారత్‌కు 26/11 కీలక నిందితుడు.. పాకిస్తాన్ పాత్ర బయటపడుతుందా?

2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్‌కు…

43 minutes ago

జగన్ కు అన్ని దారులూ మూసేస్తున్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…

51 minutes ago

అర్జున్ రెడ్డి మ్యూజిక్ వివాదం….రధన్ వివరణ

టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే అర్జున్ రెడ్డికి సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత…

1 hour ago

మైత్రి రెండు గుర్రాల స్వారీ ఏ ఫలితమిస్తుందో

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా…

2 hours ago