విజయ్ మాల్యా.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదేమో. బ్యాంకుల్లో రూ.9వేల కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టి.. విదేశాల్లో దాక్కున్న ఈ కింగ్ ఫిషర్ అధినేత కు ఇప్పుడు ఊహించని షాకింగ్ తగిలింది. విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని దేశంలోని పలు ప్రాంతాల్లో వున్న ఆయన ఆస్తులను ఒక్కొక్కటిగా వేలం వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్ను బ్యాంకులు వేలం వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ సందర్భంగా హైదరాబాద్కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది.
వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలంలో వుంచింది. అయితే దీని ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో అప్పట్లో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలుమార్లు బ్యాంకులు వేలానికి ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు చేసేది లేక ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది.
This post was last modified on August 15, 2021 10:07 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…