విజయ్ మాల్యా.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదేమో. బ్యాంకుల్లో రూ.9వేల కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టి.. విదేశాల్లో దాక్కున్న ఈ కింగ్ ఫిషర్ అధినేత కు ఇప్పుడు ఊహించని షాకింగ్ తగిలింది. విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని దేశంలోని పలు ప్రాంతాల్లో వున్న ఆయన ఆస్తులను ఒక్కొక్కటిగా వేలం వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్ను బ్యాంకులు వేలం వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ సందర్భంగా హైదరాబాద్కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది.
వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలంలో వుంచింది. అయితే దీని ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో అప్పట్లో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలుమార్లు బ్యాంకులు వేలానికి ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు చేసేది లేక ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది.
This post was last modified on August 15, 2021 10:07 am
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…