విజయ్ మాల్యా.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదేమో. బ్యాంకుల్లో రూ.9వేల కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టి.. విదేశాల్లో దాక్కున్న ఈ కింగ్ ఫిషర్ అధినేత కు ఇప్పుడు ఊహించని షాకింగ్ తగిలింది. విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని దేశంలోని పలు ప్రాంతాల్లో వున్న ఆయన ఆస్తులను ఒక్కొక్కటిగా వేలం వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్ను బ్యాంకులు వేలం వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ సందర్భంగా హైదరాబాద్కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది.
వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలంలో వుంచింది. అయితే దీని ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో అప్పట్లో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలుమార్లు బ్యాంకులు వేలానికి ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు చేసేది లేక ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది.
This post was last modified on August 15, 2021 10:07 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…