ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇంగ్లాండ్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది. లండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఈ టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండో టెస్టులో ఇండియా ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 126పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చారు.
లార్డ్స్ మైదానంలో ఇండియా ఓపెనర్లు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. దాదాపు 69ఏళ్ల తర్వాత ఇంతటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర తిరగరాసారు. గురువారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన భారత్ కి అరుదైన ఘనతని అందించింది.
ఐదు సిరీస్ ల పర్యటనలో లార్డ్స్ మైదానంలో రెండవ మ్యాచు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, బౌలింగ్ ఎంచుకుని, భారత జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. మొదటి వికెట్ కు 126పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 126పరుగుల వద్ద రోహిత్ శర్మ (83) ఔటయ్యాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకుని దూసుకుపోతున్నాడు. ఆట ముగిసే సమయాన్నికి 3వికెట్లు కోల్పోయి 276పరుగులు చేసారు.
This post was last modified on August 13, 2021 10:18 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…