ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇంగ్లాండ్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది. లండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఈ టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండో టెస్టులో ఇండియా ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 126పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చారు.
లార్డ్స్ మైదానంలో ఇండియా ఓపెనర్లు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. దాదాపు 69ఏళ్ల తర్వాత ఇంతటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర తిరగరాసారు. గురువారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన భారత్ కి అరుదైన ఘనతని అందించింది.
ఐదు సిరీస్ ల పర్యటనలో లార్డ్స్ మైదానంలో రెండవ మ్యాచు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, బౌలింగ్ ఎంచుకుని, భారత జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. మొదటి వికెట్ కు 126పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 126పరుగుల వద్ద రోహిత్ శర్మ (83) ఔటయ్యాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకుని దూసుకుపోతున్నాడు. ఆట ముగిసే సమయాన్నికి 3వికెట్లు కోల్పోయి 276పరుగులు చేసారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…