ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇంగ్లాండ్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది. లండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఈ టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండో టెస్టులో ఇండియా ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 126పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చారు.
లార్డ్స్ మైదానంలో ఇండియా ఓపెనర్లు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. దాదాపు 69ఏళ్ల తర్వాత ఇంతటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర తిరగరాసారు. గురువారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన భారత్ కి అరుదైన ఘనతని అందించింది.
ఐదు సిరీస్ ల పర్యటనలో లార్డ్స్ మైదానంలో రెండవ మ్యాచు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, బౌలింగ్ ఎంచుకుని, భారత జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. మొదటి వికెట్ కు 126పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 126పరుగుల వద్ద రోహిత్ శర్మ (83) ఔటయ్యాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకుని దూసుకుపోతున్నాడు. ఆట ముగిసే సమయాన్నికి 3వికెట్లు కోల్పోయి 276పరుగులు చేసారు.
This post was last modified on August 13, 2021 10:18 am
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…