క్రీడాకారులకు, అథ్లెట్లకు టాలెంట్ ఎంత ముఖ్యమో క్రమశిక్షణ, నియమ నిబద్ధత కూడా అంతే ముఖ్యం. క్రీడల్లో నైపుణ్యం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన చాలామంది క్రీడాకారులు తాత్కాలిక నిషేదాలు, జీవితకాలపు నిషేధాలు ఎదుర్కొన్న సందర్భాలు క్రీడాచరిత్రలో కోకొల్లలు. తాజాగా ఈ తరహా జాబితాలోకి భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ చేరింది. టోక్సో ఒలింపిక్స్ శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకుగాను ఆమెపై భారత రెజ్లింగ్ సమాఖ్య తాత్కాలిక నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
టోక్యో ఒలింపిక్స్ శిబిరంలో వినేష్ ఫొగాట్ అమర్యాదగా ప్రవర్తించిన కారణంగా డబ్ల్యూఎఫ్ఐ ఈ చర్యలు తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు వినేష్ ఫొగాట్ కు ఆగస్టు 16 వరకు గడువునిచ్చింది. అథ్లెట్లకు కేటాయించిన గదుల దగ్గర తోటి రెజ్లర్లతో కలిసి ఉండేందుకు వినేష్ ఫొగాట్ నిరాకరించిందని, వారితో ప్రాక్టీస్ చేయలేదని ఆమెపై అభియోగాలున్నాయి. దీంతోపాటు, భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్ కిట్ను కూడా వినేష్ ఫొగాట్ ధరించలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో, తాజాగా టోక్యో నుంచి వచ్చిన వినేష్ ఫొగాట్ కు డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది.
వాస్తవానికి, టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ముందు శిక్షణ కోసం హంగేరీ వెళ్లిన వినేష్ అక్కడి నుంచి టోక్యోకు వచ్చింది. అయితే, ఒలింపిక్స్ విలేజ్లో తనకు కేటాయించిన గదిలో తోటి రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్, సీమా బిస్లాతో కలిసి ఉండేందుకు వినేష్ నిరాకరించింది. వారు భారత్ నుంచి వచ్చారు కనుక వారితో కలిసి ఉండి ప్రాక్టీస్ చేస్తే కరోనా సోకే అవకాశముందని ఆక్షేపించింది. దీంతో, తాజాగా టోక్యో నుంచి వచ్చిన వినేష్ ఫొగాట్ కు డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది.
యువ రెజ్లర్ సోనమ్ అనుచిత ప్రవర్తన కారణంగా ఆమెకు కూడా డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై వినేష్ వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఆమెపై దీర్ఘకాలం నిషేధం విధించే అవకాశం ఉంది. తాజా ఎపిసోడ్ తో ఆటతీరుతో పాటు మాటతీరుతోనూ వినేష్ ఫొగాట్ నిరాశపరిచిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…