క్రీడాకారులకు, అథ్లెట్లకు టాలెంట్ ఎంత ముఖ్యమో క్రమశిక్షణ, నియమ నిబద్ధత కూడా అంతే ముఖ్యం. క్రీడల్లో నైపుణ్యం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన చాలామంది క్రీడాకారులు తాత్కాలిక నిషేదాలు, జీవితకాలపు నిషేధాలు ఎదుర్కొన్న సందర్భాలు క్రీడాచరిత్రలో కోకొల్లలు. తాజాగా ఈ తరహా జాబితాలోకి భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ చేరింది. టోక్సో ఒలింపిక్స్ శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకుగాను ఆమెపై భారత రెజ్లింగ్ సమాఖ్య తాత్కాలిక నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
టోక్యో ఒలింపిక్స్ శిబిరంలో వినేష్ ఫొగాట్ అమర్యాదగా ప్రవర్తించిన కారణంగా డబ్ల్యూఎఫ్ఐ ఈ చర్యలు తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు వినేష్ ఫొగాట్ కు ఆగస్టు 16 వరకు గడువునిచ్చింది. అథ్లెట్లకు కేటాయించిన గదుల దగ్గర తోటి రెజ్లర్లతో కలిసి ఉండేందుకు వినేష్ ఫొగాట్ నిరాకరించిందని, వారితో ప్రాక్టీస్ చేయలేదని ఆమెపై అభియోగాలున్నాయి. దీంతోపాటు, భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్ కిట్ను కూడా వినేష్ ఫొగాట్ ధరించలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో, తాజాగా టోక్యో నుంచి వచ్చిన వినేష్ ఫొగాట్ కు డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది.
వాస్తవానికి, టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ముందు శిక్షణ కోసం హంగేరీ వెళ్లిన వినేష్ అక్కడి నుంచి టోక్యోకు వచ్చింది. అయితే, ఒలింపిక్స్ విలేజ్లో తనకు కేటాయించిన గదిలో తోటి రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్, సీమా బిస్లాతో కలిసి ఉండేందుకు వినేష్ నిరాకరించింది. వారు భారత్ నుంచి వచ్చారు కనుక వారితో కలిసి ఉండి ప్రాక్టీస్ చేస్తే కరోనా సోకే అవకాశముందని ఆక్షేపించింది. దీంతో, తాజాగా టోక్యో నుంచి వచ్చిన వినేష్ ఫొగాట్ కు డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది.
యువ రెజ్లర్ సోనమ్ అనుచిత ప్రవర్తన కారణంగా ఆమెకు కూడా డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై వినేష్ వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఆమెపై దీర్ఘకాలం నిషేధం విధించే అవకాశం ఉంది. తాజా ఎపిసోడ్ తో ఆటతీరుతో పాటు మాటతీరుతోనూ వినేష్ ఫొగాట్ నిరాశపరిచిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on August 11, 2021 12:12 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…