ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొన్ని రోజులు అయితే.. ఏకంగా ఆయన చనిపోయాడంటూ కూడా వార్తలు వచ్చాయి. కొన్నిరోజులు ఆయన కనిపిచంచకపోడంతో.. ఆయనకు ఆరోగ్యం బాలేదా..? లేక చనిపోయారా అంటూ తీవ్రంగా చర్చించుకున్నారు. ఈ వార్తలకు పులిస్టాప్ పెడుతూ కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. అయినా.. ఆ పుకార్లు మాత్రం ఆగలేదు.
అయితే.. ఆ తర్వత ఆయన బయటకు వచ్చినప్పటికీ.. బాగా బరువు తగ్గి కనిపించారు. దాదాపు 20 కేజీల బరువు తగ్గడం గమనార్హం. అయితే.. ఇప్పుడు ఆయన తలకు గాయమైనట్లు కనపడటం గమనార్హం.
తాజాగా తన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యేలా తలకు బ్యాండేజీతో కిమ్ దర్శనమిచ్చారు. జులై 24-27 మధ్య నిర్వహించిన కొరియా పీపుల్స్ ఆర్మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి ఫొటోల్లో.. కిమ్ తల వెనక భాగంలో బ్యాండేజీ కనిపించింది. ఈ ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. అయితే జులై చివర్లో జరిగిన మరో కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నప్పటి ఫొటోల్లో.. బ్యాండేజీ స్థానంలో ఆకుపచ్చ రంగులో ఓ మచ్చ కనిపించింది.
దీంతో కిమ్ ఆరోగ్యానికి ఏమైందని మరోసారి చర్చ ఊపందుకుంది. అయితే, కిమ్ ఆరోగ్యం అసాధారణంగా ఏమీ లేదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. బ్యాండేజీ తీసేసిన తర్వాత తలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని అధికారులు పేర్కొన్నట్లు దక్షిణ కొరియా మీడియా తెలిపింది. జులై 11న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తలపై ఎలాంటి బ్యాండేజీలు కనిపించలేదని పేర్కొంది. అయితే.. ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసిన ఫోటోల్లో ముదురు ఆకుపచ్చ రంగులో మరకలు స్పష్టంగా కనిపించాయని తెలిపింది. దీంతో.. ఆయనకు గాయం కానీ.. శస్త్రచికిత్స గానీ జరిగి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
This post was last modified on August 4, 2021 7:13 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…