బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. ఒలంపిక్స్ లో అదరగొట్టారు. రియో ఒలంపిక్స్ లో సిల్వర్ పతకం గెలిచిన సింధు.. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచింది. దీంతో.. ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఆమె వరసగా రెండు ఒలంపిక్స్ లో.. పతకం సాధించి రికార్డు కూడా క్రియేట్ చేశారు.
దీంతో.. దేశ ప్రజలు.. చాలా మంది సింధు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. గూగుల్ లో సింధు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే.. ఎక్కువ మంది కామన్ గా అడిగిన ఓ ప్రశ్న.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశానికి గర్వ కారణంగా నిలిచిన అమ్మాయి గురించి ఇలా వెతుకుతున్నారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
గూగుల్లో పీవీ సింధుపీవీ సింధు జన్మించింది ఎక్కడ? ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది? ఎంత చదువుకుంది? అనే వివరాలను సెర్చ్ చేయడం కామనే. కానీ, కొంత మంది ఆమె సామాజిక వర్గం ఏంటి? అని సెర్చ్ చేశారు. కాంస్య పతకం సాధించిన వెంటనే సెర్చ్ ఇంజిన్లో ఇలాంటి ప్రశ్నలను సంధించి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు. చాలా మంది నెటిజనాలు ఇలా చేయడం చూస్తుంటే వారి మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో? మనం అర్థం చేసుకోవచ్చు.
విచిత్రం ఏమిటంటే.. సింధు రియో ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన సమయంలోనూ.. ఇలాంటి ప్రశ్నలే వెతకడమే గమనార్హం.
This post was last modified on August 4, 2021 6:58 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…