బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. ఒలంపిక్స్ లో అదరగొట్టారు. రియో ఒలంపిక్స్ లో సిల్వర్ పతకం గెలిచిన సింధు.. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచింది. దీంతో.. ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఆమె వరసగా రెండు ఒలంపిక్స్ లో.. పతకం సాధించి రికార్డు కూడా క్రియేట్ చేశారు.
దీంతో.. దేశ ప్రజలు.. చాలా మంది సింధు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. గూగుల్ లో సింధు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే.. ఎక్కువ మంది కామన్ గా అడిగిన ఓ ప్రశ్న.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశానికి గర్వ కారణంగా నిలిచిన అమ్మాయి గురించి ఇలా వెతుకుతున్నారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
గూగుల్లో పీవీ సింధుపీవీ సింధు జన్మించింది ఎక్కడ? ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది? ఎంత చదువుకుంది? అనే వివరాలను సెర్చ్ చేయడం కామనే. కానీ, కొంత మంది ఆమె సామాజిక వర్గం ఏంటి? అని సెర్చ్ చేశారు. కాంస్య పతకం సాధించిన వెంటనే సెర్చ్ ఇంజిన్లో ఇలాంటి ప్రశ్నలను సంధించి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు. చాలా మంది నెటిజనాలు ఇలా చేయడం చూస్తుంటే వారి మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో? మనం అర్థం చేసుకోవచ్చు.
విచిత్రం ఏమిటంటే.. సింధు రియో ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన సమయంలోనూ.. ఇలాంటి ప్రశ్నలే వెతకడమే గమనార్హం.
This post was last modified on August 4, 2021 6:58 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…