బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. ఒలంపిక్స్ లో అదరగొట్టారు. రియో ఒలంపిక్స్ లో సిల్వర్ పతకం గెలిచిన సింధు.. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచింది. దీంతో.. ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఆమె వరసగా రెండు ఒలంపిక్స్ లో.. పతకం సాధించి రికార్డు కూడా క్రియేట్ చేశారు.
దీంతో.. దేశ ప్రజలు.. చాలా మంది సింధు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. గూగుల్ లో సింధు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే.. ఎక్కువ మంది కామన్ గా అడిగిన ఓ ప్రశ్న.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశానికి గర్వ కారణంగా నిలిచిన అమ్మాయి గురించి ఇలా వెతుకుతున్నారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
గూగుల్లో పీవీ సింధుపీవీ సింధు జన్మించింది ఎక్కడ? ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది? ఎంత చదువుకుంది? అనే వివరాలను సెర్చ్ చేయడం కామనే. కానీ, కొంత మంది ఆమె సామాజిక వర్గం ఏంటి? అని సెర్చ్ చేశారు. కాంస్య పతకం సాధించిన వెంటనే సెర్చ్ ఇంజిన్లో ఇలాంటి ప్రశ్నలను సంధించి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు. చాలా మంది నెటిజనాలు ఇలా చేయడం చూస్తుంటే వారి మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో? మనం అర్థం చేసుకోవచ్చు.
విచిత్రం ఏమిటంటే.. సింధు రియో ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన సమయంలోనూ.. ఇలాంటి ప్రశ్నలే వెతకడమే గమనార్హం.
This post was last modified on August 4, 2021 6:58 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…