టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు అదరగొట్టింది. బంగారు పతకం సాధిస్తుందని అందరూ ఆశపడ్డారు. తాను కూడా బంగారు పతకం సాధించడం కోసం చాలా కష్టపడింది. కానీ.. సెమిస్ చేజారడంతో.. తర్వాతి మ్యాచ్ గెలిచి.. కాంస్యం సాధించింది. దేశానికి పతకం సాధించి.. దేశ గౌరవాన్ని మరింత పెంచింది.
ఈ క్రమంలోనే సింధును యావత్ భారత దేశం కొనియాడుతోంది. అందరి నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి. ఇక ఇది వరకే ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో రెండు ఒలంపిక్ మెడల్స్ ను సాధించిన తొలి భారతీయ మహిళగా సింధు రికార్డు సృష్టించింది.
ఈ ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుకి… కారు బహుమతి ఇవ్వాలంటూ ఆనంద్ మహీంద్రాను ఓ నెటిజన్ డిమాండ్ చేయడం గమనార్హం. కాగా.. ఆ నెటిజన్ డిమాండ్ కి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.
గత ఒలంపిక్స్ సమయంలోనే తనకు కారు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పీవీ సింధు గ్యారేజ్లో ఇప్పటికే ఒక థార్ వాహనం ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇక దీంతోపాటు ఆయన సింధును పొగడ్తల్లో ముంచెత్తారు. ఆమెకు కాంస్య పతకం వచ్చినా ఆమె చేసిన కృషి అద్భుతమని, ఆమెకు బంగారు పతకం వచ్చినట్లుగానే తాను భావిస్తున్నానని తెలిపారు. ఒలంపిక్స్ లో మెడల్ సాధించడం అంత ఆషామాషీ కాదన్నారు.
కాగా 2016లో బ్రెజిల్ రాజధాని రియోలో నిర్వహించిన ఒలంపిక్స్ లో సింధుకు సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే రెజ్లర్ సాక్షి మాలిక్కు కాంస్య పతకం వచ్చింది. దీంతో అప్పట్లో ఆనంద్ మహీంద్రా ఆ ఇద్దరికి చెరొక థార్ను బహుమతిగా ఇచ్చారు. అదే విషయాన్ని ఆయన తాజాగా తెలిపారు.
This post was last modified on August 2, 2021 7:03 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…