Trends

సింధుకి కారు గిఫ్ట్ .. మహీంద్రకు నెటిజన్ డిమాండ్..!

టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు అదరగొట్టింది. బంగారు పతకం సాధిస్తుందని అందరూ ఆశపడ్డారు. తాను కూడా బంగారు పతకం సాధించడం కోసం చాలా కష్టపడింది. కానీ.. సెమిస్ చేజారడంతో.. తర్వాతి మ్యాచ్ గెలిచి.. కాంస్యం సాధించింది. దేశానికి పతకం సాధించి.. దేశ గౌరవాన్ని మరింత పెంచింది.

ఈ క్ర‌మంలోనే సింధును యావ‌త్ భారత దేశం కొనియాడుతోంది. అంద‌రి నుంచి ఆమెకు అభినంద‌న‌లు వ‌స్తున్నాయి. ఇక ఇది వ‌ర‌కే ఆమె సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించింది. దీంతో రెండు ఒలంపిక్ మెడ‌ల్స్ ను సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా సింధు రికార్డు సృష్టించింది.

ఈ ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుకి… కారు బహుమతి ఇవ్వాలంటూ ఆనంద్ మహీంద్రాను ఓ నెటిజన్ డిమాండ్ చేయడం గమనార్హం. కాగా.. ఆ నెటిజన్ డిమాండ్ కి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.

గత ఒలంపిక్స్ సమయంలోనే తనకు కారు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పీవీ సింధు గ్యారేజ్‌లో ఇప్ప‌టికే ఒక థార్ వాహ‌నం ఉంద‌ని ఆనంద్ మ‌హీంద్రా అన్నారు. ఇక దీంతోపాటు ఆయ‌న సింధును పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. ఆమెకు కాంస్య ప‌త‌కం వ‌చ్చినా ఆమె చేసిన కృషి అద్భుత‌మని, ఆమెకు బంగారు ప‌త‌కం వ‌చ్చిన‌ట్లుగానే తాను భావిస్తున్నాన‌ని తెలిపారు. ఒలంపిక్స్ లో మెడ‌ల్ సాధించ‌డం అంత ఆషామాషీ కాద‌న్నారు.

కాగా 2016లో బ్రెజిల్ రాజ‌ధాని రియోలో నిర్వ‌హించిన ఒలంపిక్స్ లో సింధుకు సిల్వ‌ర్ మెడ‌ల్ వ‌చ్చింది. అలాగే రెజ్ల‌ర్‌ సాక్షి మాలిక్‌కు కాంస్య ప‌త‌కం వ‌చ్చింది. దీంతో అప్ప‌ట్లో ఆనంద్ మ‌హీంద్రా ఆ ఇద్ద‌రికి చెరొక థార్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. అదే విష‌యాన్ని ఆయ‌న తాజాగా తెలిపారు.

This post was last modified on August 2, 2021 7:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago