టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు అదరగొట్టింది. బంగారు పతకం సాధిస్తుందని అందరూ ఆశపడ్డారు. తాను కూడా బంగారు పతకం సాధించడం కోసం చాలా కష్టపడింది. కానీ.. సెమిస్ చేజారడంతో.. తర్వాతి మ్యాచ్ గెలిచి.. కాంస్యం సాధించింది. దేశానికి పతకం సాధించి.. దేశ గౌరవాన్ని మరింత పెంచింది.
ఈ క్రమంలోనే సింధును యావత్ భారత దేశం కొనియాడుతోంది. అందరి నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి. ఇక ఇది వరకే ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో రెండు ఒలంపిక్ మెడల్స్ ను సాధించిన తొలి భారతీయ మహిళగా సింధు రికార్డు సృష్టించింది.
ఈ ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుకి… కారు బహుమతి ఇవ్వాలంటూ ఆనంద్ మహీంద్రాను ఓ నెటిజన్ డిమాండ్ చేయడం గమనార్హం. కాగా.. ఆ నెటిజన్ డిమాండ్ కి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.
గత ఒలంపిక్స్ సమయంలోనే తనకు కారు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పీవీ సింధు గ్యారేజ్లో ఇప్పటికే ఒక థార్ వాహనం ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇక దీంతోపాటు ఆయన సింధును పొగడ్తల్లో ముంచెత్తారు. ఆమెకు కాంస్య పతకం వచ్చినా ఆమె చేసిన కృషి అద్భుతమని, ఆమెకు బంగారు పతకం వచ్చినట్లుగానే తాను భావిస్తున్నానని తెలిపారు. ఒలంపిక్స్ లో మెడల్ సాధించడం అంత ఆషామాషీ కాదన్నారు.
కాగా 2016లో బ్రెజిల్ రాజధాని రియోలో నిర్వహించిన ఒలంపిక్స్ లో సింధుకు సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే రెజ్లర్ సాక్షి మాలిక్కు కాంస్య పతకం వచ్చింది. దీంతో అప్పట్లో ఆనంద్ మహీంద్రా ఆ ఇద్దరికి చెరొక థార్ను బహుమతిగా ఇచ్చారు. అదే విషయాన్ని ఆయన తాజాగా తెలిపారు.
This post was last modified on August 2, 2021 7:03 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…