Trends

సింధుకి కారు గిఫ్ట్ .. మహీంద్రకు నెటిజన్ డిమాండ్..!

టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు అదరగొట్టింది. బంగారు పతకం సాధిస్తుందని అందరూ ఆశపడ్డారు. తాను కూడా బంగారు పతకం సాధించడం కోసం చాలా కష్టపడింది. కానీ.. సెమిస్ చేజారడంతో.. తర్వాతి మ్యాచ్ గెలిచి.. కాంస్యం సాధించింది. దేశానికి పతకం సాధించి.. దేశ గౌరవాన్ని మరింత పెంచింది.

ఈ క్ర‌మంలోనే సింధును యావ‌త్ భారత దేశం కొనియాడుతోంది. అంద‌రి నుంచి ఆమెకు అభినంద‌న‌లు వ‌స్తున్నాయి. ఇక ఇది వ‌ర‌కే ఆమె సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించింది. దీంతో రెండు ఒలంపిక్ మెడ‌ల్స్ ను సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా సింధు రికార్డు సృష్టించింది.

ఈ ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుకి… కారు బహుమతి ఇవ్వాలంటూ ఆనంద్ మహీంద్రాను ఓ నెటిజన్ డిమాండ్ చేయడం గమనార్హం. కాగా.. ఆ నెటిజన్ డిమాండ్ కి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.

గత ఒలంపిక్స్ సమయంలోనే తనకు కారు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పీవీ సింధు గ్యారేజ్‌లో ఇప్ప‌టికే ఒక థార్ వాహ‌నం ఉంద‌ని ఆనంద్ మ‌హీంద్రా అన్నారు. ఇక దీంతోపాటు ఆయ‌న సింధును పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. ఆమెకు కాంస్య ప‌త‌కం వ‌చ్చినా ఆమె చేసిన కృషి అద్భుత‌మని, ఆమెకు బంగారు ప‌త‌కం వ‌చ్చిన‌ట్లుగానే తాను భావిస్తున్నాన‌ని తెలిపారు. ఒలంపిక్స్ లో మెడ‌ల్ సాధించ‌డం అంత ఆషామాషీ కాద‌న్నారు.

కాగా 2016లో బ్రెజిల్ రాజ‌ధాని రియోలో నిర్వ‌హించిన ఒలంపిక్స్ లో సింధుకు సిల్వ‌ర్ మెడ‌ల్ వ‌చ్చింది. అలాగే రెజ్ల‌ర్‌ సాక్షి మాలిక్‌కు కాంస్య ప‌త‌కం వ‌చ్చింది. దీంతో అప్ప‌ట్లో ఆనంద్ మ‌హీంద్రా ఆ ఇద్ద‌రికి చెరొక థార్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. అదే విష‌యాన్ని ఆయ‌న తాజాగా తెలిపారు.

This post was last modified on August 2, 2021 7:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

19 minutes ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

57 minutes ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

2 hours ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

2 hours ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

2 hours ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

4 hours ago