టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు అదరగొట్టింది. బంగారు పతకం సాధిస్తుందని అందరూ ఆశపడ్డారు. తాను కూడా బంగారు పతకం సాధించడం కోసం చాలా కష్టపడింది. కానీ.. సెమిస్ చేజారడంతో.. తర్వాతి మ్యాచ్ గెలిచి.. కాంస్యం సాధించింది. దేశానికి పతకం సాధించి.. దేశ గౌరవాన్ని మరింత పెంచింది.
ఈ క్రమంలోనే సింధును యావత్ భారత దేశం కొనియాడుతోంది. అందరి నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి. ఇక ఇది వరకే ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో రెండు ఒలంపిక్ మెడల్స్ ను సాధించిన తొలి భారతీయ మహిళగా సింధు రికార్డు సృష్టించింది.
ఈ ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుకి… కారు బహుమతి ఇవ్వాలంటూ ఆనంద్ మహీంద్రాను ఓ నెటిజన్ డిమాండ్ చేయడం గమనార్హం. కాగా.. ఆ నెటిజన్ డిమాండ్ కి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.
గత ఒలంపిక్స్ సమయంలోనే తనకు కారు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పీవీ సింధు గ్యారేజ్లో ఇప్పటికే ఒక థార్ వాహనం ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇక దీంతోపాటు ఆయన సింధును పొగడ్తల్లో ముంచెత్తారు. ఆమెకు కాంస్య పతకం వచ్చినా ఆమె చేసిన కృషి అద్భుతమని, ఆమెకు బంగారు పతకం వచ్చినట్లుగానే తాను భావిస్తున్నానని తెలిపారు. ఒలంపిక్స్ లో మెడల్ సాధించడం అంత ఆషామాషీ కాదన్నారు.
కాగా 2016లో బ్రెజిల్ రాజధాని రియోలో నిర్వహించిన ఒలంపిక్స్ లో సింధుకు సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే రెజ్లర్ సాక్షి మాలిక్కు కాంస్య పతకం వచ్చింది. దీంతో అప్పట్లో ఆనంద్ మహీంద్రా ఆ ఇద్దరికి చెరొక థార్ను బహుమతిగా ఇచ్చారు. అదే విషయాన్ని ఆయన తాజాగా తెలిపారు.
This post was last modified on August 2, 2021 7:03 pm
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…