టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు అదరగొట్టింది. బంగారు పతకం సాధిస్తుందని అందరూ ఆశపడ్డారు. తాను కూడా బంగారు పతకం సాధించడం కోసం చాలా కష్టపడింది. కానీ.. సెమిస్ చేజారడంతో.. తర్వాతి మ్యాచ్ గెలిచి.. కాంస్యం సాధించింది. దేశానికి పతకం సాధించి.. దేశ గౌరవాన్ని మరింత పెంచింది.
ఈ క్రమంలోనే సింధును యావత్ భారత దేశం కొనియాడుతోంది. అందరి నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి. ఇక ఇది వరకే ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో రెండు ఒలంపిక్ మెడల్స్ ను సాధించిన తొలి భారతీయ మహిళగా సింధు రికార్డు సృష్టించింది.
ఈ ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుకి… కారు బహుమతి ఇవ్వాలంటూ ఆనంద్ మహీంద్రాను ఓ నెటిజన్ డిమాండ్ చేయడం గమనార్హం. కాగా.. ఆ నెటిజన్ డిమాండ్ కి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.
గత ఒలంపిక్స్ సమయంలోనే తనకు కారు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పీవీ సింధు గ్యారేజ్లో ఇప్పటికే ఒక థార్ వాహనం ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇక దీంతోపాటు ఆయన సింధును పొగడ్తల్లో ముంచెత్తారు. ఆమెకు కాంస్య పతకం వచ్చినా ఆమె చేసిన కృషి అద్భుతమని, ఆమెకు బంగారు పతకం వచ్చినట్లుగానే తాను భావిస్తున్నానని తెలిపారు. ఒలంపిక్స్ లో మెడల్ సాధించడం అంత ఆషామాషీ కాదన్నారు.
కాగా 2016లో బ్రెజిల్ రాజధాని రియోలో నిర్వహించిన ఒలంపిక్స్ లో సింధుకు సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే రెజ్లర్ సాక్షి మాలిక్కు కాంస్య పతకం వచ్చింది. దీంతో అప్పట్లో ఆనంద్ మహీంద్రా ఆ ఇద్దరికి చెరొక థార్ను బహుమతిగా ఇచ్చారు. అదే విషయాన్ని ఆయన తాజాగా తెలిపారు.
This post was last modified on August 2, 2021 7:03 pm
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…
ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…