ప్రభుత్వ ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకునే సదుపాయం ఉంది. వాళ్లకు ఉద్యోగం చేయడం కుదరని సమయంలో.. స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందుతారు. ఇప్పటి వరకు ఇలా పదవీ విరమణ పొందినవారిని మీరు చాలా మందే చూసి ఉంటారు. అయితే.. తాజాగా ఓ మహిళా ఐపీఎస్ వీర్ఎస్ తీసుకోగా.. అలా తీసుకోవడానికి గల కారణం విని అందరూ షాకయ్యారు. హర్యానకు చెందిన ఈ మహిళా అధికారిణి.. ఇన్నాళ్లు ప్రజాసేవలో ఉన్నాను.. ఇకపై దేవుడి సేవ చేసుకుంటానని వీఆర్ఎస్ కు అప్లై చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఐజీ స్థాయి పోస్టులో ఉన్న భారతి అరోరా భగవాన్ శ్రీకృష్ణుడి సేవకు అంకితమయ్యేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నారు. 1998 బ్యాచ్ కు చెందిన భారతి… ప్రస్తుతం అంబాలా రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి దరఖాస్తు పంపారామె. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నానని… భగవంతుని సాక్షాత్కారం కోసం పని చేస్తానని వివరించారు.
ఎందరో సాధువులు చూపిన మార్గంలో ఇకపై నడవాలని కోరుకుంటున్నానని అన్నారు భారతి అరోరా. శ్రీకృష్ణుడి సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని దరఖాస్తులో వివరించారు. వీఆర్ఎస్ కోరుతూ ఆమె చేసుకున్న దరఖాస్తును హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ వద్దకు చేరింది. 2009లో ఈయన అంబాలా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన్ను అరెస్ట్ చేయాలని భారతి ఆదేశించారు. ఇప్పుడు అదే అనిల్ విజ్ దగ్గరకు ఆమె ఫైల్ చేరడం విశేషం.
This post was last modified on July 30, 2021 10:21 am
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…