టోక్యో ఒలంపిక్స్ లో భారత షట్లర్ పీవీ సింధు.. దూసుకెళుతోంది. వరస విజయాలతో తన పరంపర కొనసాగిస్తోంది. ఫ్రీ క్వార్టర్స్లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్ తో జరిగిన మ్యాచ్లో ప్రారంభం నుంచి ఆధిపత్యం చూపించారు. 21-15,21-13తో బ్లిక్ ఫెల్ట్ పై విజయం సాధించారు. ఈ మ్యాచ్కు ముందు వీరిద్దరూ 5సార్లు తలపడ్డారు. నాలుగుసార్లు పీవీ సింధునే గెలిచారు. వరుసగా మూడు విజయాలతో పీవీ సింధు గ్రూప్ జేలో తొలిస్థానంలో ఉన్నారు.
బుధవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు ఘన విజయం సాధించారు. గ్రూప్ దశ మ్యాచ్లో చెంగ్ యీపై 21-6, 21-16 తేడాతో సింధు గెలుపొందారు. నాలుగు రోజుల క్రితం జరిగిన గ్రూప్ జె తొలి మ్యాచ్లోనూ ఆమె విజయం సాధించారు. ఇజ్రాయిల్ షట్లర్ సెనియా పొలికర్ పోవ్పై సింధు విజయం సాధించి ఒలింపిక్స్లో బోణీ కొట్టారు.
గత ఒలింపిక్స్లో కొంచెంలో స్వర్ణం దక్కలేదు. ఇప్పుడు స్వర్ణం కోసం సింధు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు బ్యాట్కు పనిచెబుతున్నారు. ఎలాగైనా సరే ఈ సారి గోల్డ్ మెడల్ను వదులుకునే ఛాన్స్ ఇవ్వనని ఆమె అంటున్నారు.
This post was last modified on July 29, 2021 10:16 am
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…