Trends

మాల్యా ప్లానే వర్కవుటయ్యిందా ?

అప్పులు ఎగ్గొట్టడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త విజయామాల్య ప్లానే వర్కవుటైనట్లుంది. దేశంలోని వివిధ బ్యాంకుల్లో సుమారు రు. 9500 కోట్లు అప్పులు తీసుకున్నారు. వాటిని కట్టకుండా దేశందాటి పారిపోయారు. భారత్ ప్రభుత్వం మాల్యాను ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుగా ప్రకటించింది. అయితే తాజాగా బ్రిటన్ కోర్టు మాల్యాను దివాలా తీసినట్లు ప్రకటించటం గమనార్హం.

దివాలా తీసినట్లు బ్రిటన్ కోర్టు ప్రకటించటమంటే బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పుల్లో ఒక్క రూపాయి కూడా మాల్యా కట్టాల్సిన అవసరం లేదు. అప్పులకోసం మాల్యా బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంకులు అమ్ముకుని తమ అప్పులను రాబట్టుకోవాల్సుంటుంది. అయితే తీసుకున్న అప్పులకు ఆస్తులమ్మి జమచేసుకోవాల్సిన అప్పులకు ఏమాత్రం పొంతనుండదు.

తీసుకున్న అప్పులేమో వేల కోట్ల రూపాయలు. ఆస్తులను అమ్మితే వచ్చేదేమో వందల కోట్లు మాత్రమే. మరి ఆస్తులమ్మితే వచ్చే వందల కోట్ల రూపాయలతో తీసుకున్న అప్పు వేల కోట్ల రూపాయలు తీరేదెలా ? ఎలాగంటే అప్పులు తీరదన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పులకన్నా తనకు ఆస్తులే ఎక్కువున్నాయని కాబట్టి తనను భారత్ ప్రభుత్వం అరెస్టు చేయకుండా ఉంటే భారత్ కు వచ్చి మొత్తం అప్పులను తీర్చేస్తానని గతంలో మాల్యా ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

అయితే మాల్యా ప్రకటించిందంతా అబద్ధమేని తర్వాత అర్ధమైంది. ఎందుకంటే కొన్ని ఆస్తులను వేలంపాట ద్వారా అమ్మాలని బ్యాంకులు ప్రయత్నిస్తే కొనుగోలుదారుల నుండి పెద్దగా స్పందనరాలేదు. వివాదంలో ఉన్న ఆస్తులను కొనటానికి చాలామంది ముందుకురారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా చాలా తక్కువ ధరలకు కొనాలని మాత్రమే చూస్తారు. అంటే మాల్యా తీసుకున్న అప్పులు ఎప్పటికీ తీరేవికావు.

అందుకనే అప్పుల్లో వచ్చినకాడికి రాబట్టుకుని మాల్యాను జైల్లో పెట్టాలని దర్యాప్తు సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మాల్యా దివాలా తీసినట్లు బ్రిటన్ కోర్టు ప్రకటించడమంటే మాల్యాకు అనుకూలంగానే తీర్పొచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఒకసారి దివాలా తీసినట్లు కోర్టే ప్రకటించిందంటే ఇక అప్పులిచ్చిన వాళ్ళు మాల్యా వెంట పడేందుకు లేదు. కాకపోతే బ్రిటన్ కోర్టు మనదేశంలో చెల్లుబాటవుతుందా అన్నదే కీలకం. అయినా మాల్యాకు ఇండియాకు వచ్చే ఉద్దేశ్యం ఉంటేనే కదా.

This post was last modified on July 27, 2021 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

57 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago