టోక్యో ఒలంపిక్స్ సందడిగా జరుగుతున్నాయి. మన దేశ గౌరవాన్ని కాపాడేందుకు క్రీడాకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కి రజతం దక్కిన సంగతి తెలిసిందే. రజతం దక్కిందని ఆనందపడినా.. గోల్డ్ మిస్ అయ్యిందే అని చాలామంది నిరుత్సాహపడ్డారు.
అయితే.. ఇప్పుడు ఆ చేజారిన స్వర్ణం మళ్లీ మన దేశానికి దక్కే అవకాశం కనిపిస్తోంది. వెయిట్ లిఫ్టింగ్ లో మన ఇండియా కు చెందిన క్రీడాకారిణి మీరాబాయి చాను వెండి పతకం గెలవగా… చైనా వెయిట్ లిఫ్టర్ జీహూహో స్వర్ణం గెలుచుకుంది. అయితే.. ఈ చైనా క్రీడాకారిణి జీహూహో ను డోపింగ్ టెస్టుకు పంపాలని ఒలంపిక్స్ నిర్వాహకులు భావిస్తున్నారు.
ఒకవేళ నిజంగానే ఆ చైనా క్రీడాకారిణిని డోపింగ్ టెస్ట్ కు పంపితే… ఆర్ టెస్టులో ఆమె పాజిటివ్గా తేలితే బంగారు పథకం మీరా భాయ్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. డోపింగ్ టెస్ట్ చేసేందుకు జిహూహోను టోక్యో లోనే ఉండాలని ఇప్పటికే నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. కాగా భారత వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చాను చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 49 కేజీల విభాగంలో జరిగిన ఒలంపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆమె సిల్వర్ మెడల్ను సాధించింది.
This post was last modified on July 26, 2021 3:51 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…