టోక్యో ఒలంపిక్స్ సందడిగా జరుగుతున్నాయి. మన దేశ గౌరవాన్ని కాపాడేందుకు క్రీడాకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కి రజతం దక్కిన సంగతి తెలిసిందే. రజతం దక్కిందని ఆనందపడినా.. గోల్డ్ మిస్ అయ్యిందే అని చాలామంది నిరుత్సాహపడ్డారు.
అయితే.. ఇప్పుడు ఆ చేజారిన స్వర్ణం మళ్లీ మన దేశానికి దక్కే అవకాశం కనిపిస్తోంది. వెయిట్ లిఫ్టింగ్ లో మన ఇండియా కు చెందిన క్రీడాకారిణి మీరాబాయి చాను వెండి పతకం గెలవగా… చైనా వెయిట్ లిఫ్టర్ జీహూహో స్వర్ణం గెలుచుకుంది. అయితే.. ఈ చైనా క్రీడాకారిణి జీహూహో ను డోపింగ్ టెస్టుకు పంపాలని ఒలంపిక్స్ నిర్వాహకులు భావిస్తున్నారు.
ఒకవేళ నిజంగానే ఆ చైనా క్రీడాకారిణిని డోపింగ్ టెస్ట్ కు పంపితే… ఆర్ టెస్టులో ఆమె పాజిటివ్గా తేలితే బంగారు పథకం మీరా భాయ్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. డోపింగ్ టెస్ట్ చేసేందుకు జిహూహోను టోక్యో లోనే ఉండాలని ఇప్పటికే నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. కాగా భారత వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చాను చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 49 కేజీల విభాగంలో జరిగిన ఒలంపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆమె సిల్వర్ మెడల్ను సాధించింది.
This post was last modified on July 26, 2021 3:51 pm
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…
ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక సాధారణ ఉద్యోగిలా దర్శనమిచ్చాడు. శ్రీలంక…
ఒక హీరో వరుసగా డిజాస్టర్లు ఇచ్చినపుడు.. తన చివరి హిట్ ఎప్పుడో తన అభిమానులు కూడా మరిచిపోయినపుడు.. అతను కొత్తగా…
ఎల్లుండి విడుదల కాబోతున్న కొరియన్ కనకరాజుకి రేపు రాత్రి ప్రీమియర్లు వేయడం దాదాపు ఫిక్స్. ఇంకా టికెట్ల అమ్మకాలు మొదలుకాలేదు…