Trends

సెప్టెంబర్ నుంచి చిన్నారులకు వ్యాక్సిన్..!

భారత్ లో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు 18ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీంతో.. చిన్నారులకు ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా గుడ్ న్యూస్ తెలియజేశారు.

భారత్‌లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌లు సెప్టెంబర్‌ నుండి ఆందుబాటులోకి రావచ్చని ఎయిమ్స్‌ చీఫ్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ఇది అతి ముఖ్యమైన చర్య అని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. జైడస్‌ చిన్నారులపై ట్రయల్స్‌ నిర్వహించిందని, అత్యవసర అనుమతుల కోసం వేచిచూస్తుందని అన్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ ట్రయల్స్‌ ఆగస్టు, సెప్టెంబర్‌లోపు పూర్తవుతాయని, వెంటనే అనుమతులు పొందవచ్చని అన్నారు.

అమెరికాకు చెందిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదించిందని చెప్పారు. దీంతో సెప్టెంబర్‌ నుండి చిన్నారులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించవచ్చని భావిస్తున్నామని అన్నారు. దేశంలో ఇప్పటివరకు 42 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌లను అందించామని, ఈ ఏడాది చివరి నాటికి పెద్దలందరికీ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

అయితే థర్డ్‌వేవ్‌ చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో.. చిన్నారులకు వ్యాక్సిన్‌లను అందించడంపై స్పష్టతనివ్వలేదు. 11-17 ఏళ్లలోపు పిల్లలతో కలిసి జీవించే వృద్ధుల్లో వ్యాధి సోకే ప్రమాదం 18-30 శాతం పెరుగుతోందని ఈ వారం ప్రారంభంలో లాన్సెట్‌ ఒక అధ్యయనాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గులేరియా స్పందిస్తూ.. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వ్యాధి సొకే ప్రమాదం అధికంగా ఉందని అన్నారు.

చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించడానికి ఇది కూడా ఒక కారణమని అన్నారు. స్వల్పంగా వ్యాధి సోకిన చిన్నారులు వృద్ధులకు వ్యాప్తి చేయవచ్చని .. అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని చెప్పారు.

This post was last modified on July 24, 2021 6:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

52 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

1 hour ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

5 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago