మరికొద్దిరోజుల్లో టోక్యో ఒలంపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా ఒలంపిక్ విలేజ్ ని చేరుకుంటున్నారు. అక్కడ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయగా.. అందులోని బెడ్స్ అట్టముక్కలతో తయారు చేశారని.. క్రీడాకారులు శృంగారం పై దృష్టిపెడితే.. ఆట సరిగా ఆడలేరి అందుకోసం యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఓ క్రీడాకారుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారడంతో.. అక్కడి అధికారులు సైతం స్పందించాల్సి వచ్చింది. అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన కార్డ్బోర్డ్ మంచాలు బలంగా ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు తెలిపారు. తమ ట్విట్టర్ అకౌంట్లో వాళ్లు ఈ విషయాన్ని చెప్పారు. శృంగారానికి సరిపడే రీతిలో మంచాలు దృఢంగా లేవని, ఆ మంచాలు యాంటీ-సెక్స్ అనే విమర్శలు వచ్చాయి.
అయితే ఐర్లాండ్కు చెందిన జిమ్నాస్ట్ రైస్ మెక్క్లినాగన్.. తన రూమ్లో ఉన్న కార్డ్బోర్డ్ మంచంపై ఎగిరి గంతులేశాడు. సామాజిక దూరాన్ని ప్రోత్సహించే రీతిలో మంచాలను తయారు చేసినట్లు వస్తున్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. జిమ్నాస్ట్ మెక్క్లినాగన్ ఆ వార్తలను తప్పుపట్టే రీతిలో మంచంపై ఎగిరెగిరి గంతులేశాడు. ఆ వీడియోను తమ ట్విట్టర్లో పోస్టు చేసిన నిర్వాహకులు .. కార్డ్బోర్డ్ మంచాలు బలంగా ఉన్నట్లు చెప్పారు.
ఒలింపిక్స్ క్రీడల సమయంలో ఒలింపిక్ విలేజ్లో వేలాది మంది అథ్లెట్లు బస చేయనున్నారు. దాదాపు లక్షా 60 వేల కండోమ్లను అథ్లెట్లకు పంపిణీ చేయనున్నారు. నిజానికి క్రీడల సమయంలో ఆ కండోమ్లు వాడుకోవడానికి ఇవ్వడంలేదు. కానీ స్వదేశానికి వెళ్లిన తర్వాత ఎయిడ్స్ లాంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో వాటిని ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
This post was last modified on July 19, 2021 5:55 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…