Trends

టోక్యో ఒలంపిక్స్.. హాట్ టాపిక్ గా ‘యాంటీ సెక్స్ బెడ్స్’

మరికొద్దిరోజుల్లో టోక్యో ఒలంపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా ఒలంపిక్ విలేజ్ ని చేరుకుంటున్నారు. అక్కడ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయగా.. అందులోని బెడ్స్ అట్టముక్కలతో తయారు చేశారని.. క్రీడాకారులు శృంగారం పై దృష్టిపెడితే.. ఆట సరిగా ఆడలేరి అందుకోసం యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఓ క్రీడాకారుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారడంతో.. అక్కడి అధికారులు సైతం స్పందించాల్సి వచ్చింది. అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన కార్డ్‌బోర్డ్ మంచాలు బ‌లంగా ఉన్న‌ట్లు ఒలింపిక్ నిర్వాహ‌కులు తెలిపారు. త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో వాళ్లు ఈ విష‌యాన్ని చెప్పారు. శృంగారానికి స‌రిప‌డే రీతిలో మంచాలు దృఢంగా లేవ‌ని, ఆ మంచాలు యాంటీ-సెక్స్ అనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అయితే ఐర్లాండ్‌కు చెందిన జిమ్నాస్ట్ రైస్ మెక్‌క్లినాగ‌న్‌.. త‌న రూమ్‌లో ఉన్న కార్డ్‌బోర్డ్ మంచంపై ఎగిరి గంతులేశాడు. సామాజిక దూరాన్ని ప్రోత్స‌హించే రీతిలో మంచాల‌ను త‌యారు చేసిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను నిర్వాహ‌కులు ఖండించారు. జిమ్నాస్ట్ మెక్‌క్లినాగ‌న్ ఆ వార్త‌ల‌ను త‌ప్పుప‌ట్టే రీతిలో మంచంపై ఎగిరెగిరి గంతులేశాడు. ఆ వీడియోను త‌మ‌ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసిన నిర్వాహ‌కులు .. కార్డ్‌బోర్డ్ మంచాలు బ‌లంగా ఉన్న‌ట్లు చెప్పారు.

ఒలింపిక్స్ క్రీడల స‌మ‌యంలో ఒలింపిక్ విలేజ్‌లో వేలాది మంది అథ్లెట్లు బ‌స చేయ‌నున్నారు. దాదాపు ల‌క్షా 60 వేల కండోమ్‌ల‌ను అథ్లెట్ల‌కు పంపిణీ చేయ‌నున్నారు. నిజానికి క్రీడ‌ల స‌మ‌యంలో ఆ కండోమ్‌లు వాడుకోవ‌డానికి ఇవ్వ‌డంలేదు. కానీ స్వ‌దేశానికి వెళ్లిన త‌ర్వాత ఎయిడ్స్ లాంటి వ్యాధుల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో వాటిని ఇస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

21 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

50 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago