మరికొద్దిరోజుల్లో టోక్యో ఒలంపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా ఒలంపిక్ విలేజ్ ని చేరుకుంటున్నారు. అక్కడ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయగా.. అందులోని బెడ్స్ అట్టముక్కలతో తయారు చేశారని.. క్రీడాకారులు శృంగారం పై దృష్టిపెడితే.. ఆట సరిగా ఆడలేరి అందుకోసం యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఓ క్రీడాకారుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారడంతో.. అక్కడి అధికారులు సైతం స్పందించాల్సి వచ్చింది. అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన కార్డ్బోర్డ్ మంచాలు బలంగా ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు తెలిపారు. తమ ట్విట్టర్ అకౌంట్లో వాళ్లు ఈ విషయాన్ని చెప్పారు. శృంగారానికి సరిపడే రీతిలో మంచాలు దృఢంగా లేవని, ఆ మంచాలు యాంటీ-సెక్స్ అనే విమర్శలు వచ్చాయి.
అయితే ఐర్లాండ్కు చెందిన జిమ్నాస్ట్ రైస్ మెక్క్లినాగన్.. తన రూమ్లో ఉన్న కార్డ్బోర్డ్ మంచంపై ఎగిరి గంతులేశాడు. సామాజిక దూరాన్ని ప్రోత్సహించే రీతిలో మంచాలను తయారు చేసినట్లు వస్తున్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. జిమ్నాస్ట్ మెక్క్లినాగన్ ఆ వార్తలను తప్పుపట్టే రీతిలో మంచంపై ఎగిరెగిరి గంతులేశాడు. ఆ వీడియోను తమ ట్విట్టర్లో పోస్టు చేసిన నిర్వాహకులు .. కార్డ్బోర్డ్ మంచాలు బలంగా ఉన్నట్లు చెప్పారు.
ఒలింపిక్స్ క్రీడల సమయంలో ఒలింపిక్ విలేజ్లో వేలాది మంది అథ్లెట్లు బస చేయనున్నారు. దాదాపు లక్షా 60 వేల కండోమ్లను అథ్లెట్లకు పంపిణీ చేయనున్నారు. నిజానికి క్రీడల సమయంలో ఆ కండోమ్లు వాడుకోవడానికి ఇవ్వడంలేదు. కానీ స్వదేశానికి వెళ్లిన తర్వాత ఎయిడ్స్ లాంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో వాటిని ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
This post was last modified on July 19, 2021 5:55 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…