క్రికెట్ లో మీరు ఎన్నో రికార్డుల గురించి విని ఉంటారు. కానీ..ఇది అన్నింటికన్నా.. పరమ చెత్త రికార్డు కావడం గమనార్హం. కేవలం ఏడు పరుగులకే ఓ జట్టు మొత్తం అవుట్ కావడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకెళితే.. యార్క్షైర్ ప్రీమియర్ టీ10 లీగ్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో అత్యంత రికార్డ్ నమోదయ్యాయి. ఈస్ట్రింగ్స్టన్ క్లబ్తో జరిగిన ఈ మ్యాచ్లో.. హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది. అనంతరం స్వల్ప ఛేదనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 8 బంతుల్లోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
దీంతో ఈ మ్యాచ్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయిన మ్యాచ్గా చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్లోని రెండు ఇన్నింగ్స్లు కేవలం 56 బంతుల్లోనే ముగిసిపోయాయి.
తొలుత బ్యాటింగ్కు దిగిన హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు.. డ్రెస్సింగ్ రూమ్లో ఏదో పని ఉందన్నట్లుగా క్రీజులోకి వచ్చీరాగానే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్కు చేరారు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 10మంది బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయగా, 8 మంది ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. మిగిలిప ఇద్దరు ఆటగాళ్లు అతికష్టం మీద తలో రెండు పరుగులు చేయగా, మిగిలిన మూడు పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్ధి బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత 8 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్రింగ్స్టన్ జట్టు.. కేవలం 1.2 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా టార్గెట్ను రీచ్ కావడంతో ఏ ఫార్మాట్టోనైనా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఈస్ట్రింగ్స్టన్ ఆటగాడు జేమ్స్ ఒక్కడే 8 బంతులను ఎదుర్కొని బౌండరీ సాయంతో 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్ట్రాగా లభించింది. మరోవైపు ఈ మ్యాచ్ పై క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. మీ కన్నా గల్లీ క్రికెటర్లు నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on July 12, 2021 3:47 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…