క్రికెట్ లో మీరు ఎన్నో రికార్డుల గురించి విని ఉంటారు. కానీ..ఇది అన్నింటికన్నా.. పరమ చెత్త రికార్డు కావడం గమనార్హం. కేవలం ఏడు పరుగులకే ఓ జట్టు మొత్తం అవుట్ కావడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకెళితే.. యార్క్షైర్ ప్రీమియర్ టీ10 లీగ్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో అత్యంత రికార్డ్ నమోదయ్యాయి. ఈస్ట్రింగ్స్టన్ క్లబ్తో జరిగిన ఈ మ్యాచ్లో.. హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది. అనంతరం స్వల్ప ఛేదనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 8 బంతుల్లోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
దీంతో ఈ మ్యాచ్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయిన మ్యాచ్గా చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్లోని రెండు ఇన్నింగ్స్లు కేవలం 56 బంతుల్లోనే ముగిసిపోయాయి.
తొలుత బ్యాటింగ్కు దిగిన హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు.. డ్రెస్సింగ్ రూమ్లో ఏదో పని ఉందన్నట్లుగా క్రీజులోకి వచ్చీరాగానే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్కు చేరారు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 10మంది బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయగా, 8 మంది ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. మిగిలిప ఇద్దరు ఆటగాళ్లు అతికష్టం మీద తలో రెండు పరుగులు చేయగా, మిగిలిన మూడు పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్ధి బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత 8 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్రింగ్స్టన్ జట్టు.. కేవలం 1.2 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా టార్గెట్ను రీచ్ కావడంతో ఏ ఫార్మాట్టోనైనా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఈస్ట్రింగ్స్టన్ ఆటగాడు జేమ్స్ ఒక్కడే 8 బంతులను ఎదుర్కొని బౌండరీ సాయంతో 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్ట్రాగా లభించింది. మరోవైపు ఈ మ్యాచ్ పై క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. మీ కన్నా గల్లీ క్రికెటర్లు నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…