Trends

జమ్మూలో ఎన్ కౌంటర్.. తెలుగు జవాన్ వీరమరణం..!

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరిలో ఒకరు తెలుగు జవాను కూడా ఉండటం గమనార్హం.

రాజౌరీ జిల్లాలోని సుందర్‌ బాని సెక్టార్ లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లలో ఒకరు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జశ్వంత్‌ రెడ్డి. ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో జశ్వంత్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

2016లో మద్రాసు రెజిమెంట్‌ ద్వారా సైన్యంలో చేరారు జశ్వంత్. తొలుత నీలగిరిలో పనిచేయగా.. తర్వాత జమ్మూకాశ్మీర్ కు వెళ్లారు. నాలుగు నెలల క్రితమే సెలవులపై ఇంటికొచ్చిన జశ్వంత్ రెడ్డికి పెళ్లి చేయాలని భావించారు. మరో నెల రోజుల్లో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతలోనే మరణవార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. ఇవాళ రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉంది.

This post was last modified on July 9, 2021 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని…

3 hours ago

శర్వానంద్ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారా

నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…

3 hours ago

ఓపెనింగ్ టాక్…. డామినేషన్ ఎవరిది?

నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…

3 hours ago

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…

5 hours ago

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

8 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

11 hours ago