ఇప్పటికే దేశాన్ని కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదు. కరోనా లోనూ కొత్త రకం వేరియంట్లు దేశాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. దేశంలో జికా వైరస్ కలకలం రేపడం మొదలుపెట్టింది.. తాజాగా.. కేరళ రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు వెలుగు చూసింది. 24ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు.
తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని.. వాటికి సంబంధించి పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థ నుంచి ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్ కి వెళ్లాయని.. వారిలొ వైద్యులు సహా 13మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నామని వైరాలజీ అధికారులు తెలిపారు.
ఇప్పటికే పాజిటివ్ గా నిర్థారణ అయిన మహిళ గురువారం ఒక బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. జ్వరం, తలనొప్పి, ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలతో ఆమె జూన్ 28న ఆస్పత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆమె రాష్ట్రం దాటి ఎక్కడికీ ప్రయాణించలదేని.. ఆమె ఇల్లు తమిళనాడు సరిహద్దులో ఉందని అధికారులు చెప్పారు. వారం కిందట ఆమె తల్లిలోనూ ఇవే లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. జికా వైరస్ లక్షణాలు కూడా డెంకీ జ్వరం లానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
This post was last modified on July 9, 2021 10:16 am
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…