Trends

దేశంలో జికా వైరస్ కలకలం.. తొలికేసు నమోదు..!

ఇప్పటికే దేశాన్ని కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదు. కరోనా లోనూ కొత్త రకం వేరియంట్లు దేశాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. దేశంలో జికా వైరస్ కలకలం రేపడం మొదలుపెట్టింది.. తాజాగా.. కేరళ రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు వెలుగు చూసింది. 24ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు.

తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని.. వాటికి సంబంధించి పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థ నుంచి ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్ కి వెళ్లాయని.. వారిలొ వైద్యులు సహా 13మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నామని వైరాలజీ అధికారులు తెలిపారు.

ఇప్పటికే పాజిటివ్ గా నిర్థారణ అయిన మహిళ గురువారం ఒక బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. జ్వరం, తలనొప్పి, ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలతో ఆమె జూన్ 28న ఆస్పత్రిలో చేరారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆమె రాష్ట్రం దాటి ఎక్కడికీ ప్రయాణించలదేని.. ఆమె ఇల్లు తమిళనాడు సరిహద్దులో ఉందని అధికారులు చెప్పారు. వారం కిందట ఆమె తల్లిలోనూ ఇవే లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. జికా వైరస్ లక్షణాలు కూడా డెంకీ జ్వరం లానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

This post was last modified on July 9, 2021 10:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

1 hour ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

7 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

7 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

11 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

15 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

15 hours ago