కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. దీనిని తరిమికొట్టేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా..కోవాగ్జిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ ఫైనల్ రిజల్ట్ ను కంపెనీ ప్రకటించింది.
తీవ్రమైన, మధ్యస్థ కేసుల్లో వ్యాక్సిన్ 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ ప్రకటించింది. తీవ్రమైన కేసుల్లో 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించామంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని భారత్ బయోటెక్ డేటా రిలీజ్ చేసింది.
కోవాగ్జిన్ తీసుకున్న వారిలో కరోనా తీవ్ర లక్షణాలు కనిపించవని, ఆసుపత్రిలో చేరాల్సిన అత్యవసర పరిస్థితిని తగ్గిస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ మేరకు డేటాను మెడ్జివ్ లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ ఫుల్ సేఫ్ అని రుజువైందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. థర్డ్ ఫేజ్ లో 25,798 మందిని డోస్-1 లో, 24,419 మందిని డోస్-2లో పర్యవేక్షించామని… 146 రోజుల పాటు ట్రయల్స్ చేశామని తెలిపింది.
భారత ప్రభుత్వరంగ సంస్థ ఐసీఎంఆర్ సహకారంతో ఈ వ్యాక్సిన్ తయారు చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
This post was last modified on July 3, 2021 12:00 pm
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…