Trends

కోవాగ్జిన్ సామర్థ్యం 77శాతం…వారికి కరోనా భయం తగ్గినట్లే..!

కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. దీనిని తరిమికొట్టేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా..కోవాగ్జిన్ థ‌ర్డ్ ఫేజ్ ట్ర‌య‌ల్స్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ను కంపెనీ ప్ర‌క‌టించింది.

తీవ్రమైన, మ‌ధ్య‌స్థ కేసుల్లో వ్యాక్సిన్ 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ ప్ర‌క‌టించింది. తీవ్రమైన కేసుల్లో 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించామంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్‌లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని భార‌త్ బ‌యోటెక్ డేటా రిలీజ్ చేసింది.

కోవాగ్జిన్ తీసుకున్న వారిలో క‌రోనా తీవ్ర ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వ‌ని, ఆసుప‌త్రిలో చేరాల్సిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని త‌గ్గిస్తుంద‌ని భార‌త్ బ‌యోటెక్ తెలిపింది. ఈ మేర‌కు డేటాను మెడ్జివ్ లో ప్ర‌చురించింది. ఇండియాలో జ‌రిగిన అతిపెద్ద థ‌ర్డ్ ఫేజ్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ లో వ్యాక్సిన్ ఫుల్ సేఫ్ అని రుజువైంద‌ని కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది. థ‌ర్డ్ ఫేజ్ లో 25,798 మందిని డోస్-1 లో, 24,419 మందిని డోస్-2లో ప‌ర్య‌వేక్షించామ‌ని… 146 రోజుల పాటు ట్ర‌య‌ల్స్ చేశామ‌ని తెలిపింది.

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ ఐసీఎంఆర్ స‌హ‌కారంతో ఈ వ్యాక్సిన్ త‌యారు చేసిన‌ట్లు భార‌త్ బ‌యోటెక్ వెల్ల‌డించింది.

This post was last modified on July 3, 2021 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

8 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago