కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. దీనిని తరిమికొట్టేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా..కోవాగ్జిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ ఫైనల్ రిజల్ట్ ను కంపెనీ ప్రకటించింది.
తీవ్రమైన, మధ్యస్థ కేసుల్లో వ్యాక్సిన్ 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ ప్రకటించింది. తీవ్రమైన కేసుల్లో 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించామంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని భారత్ బయోటెక్ డేటా రిలీజ్ చేసింది.
కోవాగ్జిన్ తీసుకున్న వారిలో కరోనా తీవ్ర లక్షణాలు కనిపించవని, ఆసుపత్రిలో చేరాల్సిన అత్యవసర పరిస్థితిని తగ్గిస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ మేరకు డేటాను మెడ్జివ్ లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ ఫుల్ సేఫ్ అని రుజువైందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. థర్డ్ ఫేజ్ లో 25,798 మందిని డోస్-1 లో, 24,419 మందిని డోస్-2లో పర్యవేక్షించామని… 146 రోజుల పాటు ట్రయల్స్ చేశామని తెలిపింది.
భారత ప్రభుత్వరంగ సంస్థ ఐసీఎంఆర్ సహకారంతో ఈ వ్యాక్సిన్ తయారు చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
This post was last modified on July 3, 2021 12:00 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…