కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు.. వ్యాక్సిన్ ప్రక్రియను దేశంలో వేగవంతం చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు 18ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. కానీ.. చిన్నపిల్లలు, గర్భిణీలకు మాత్రం ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కాగా.. తాజాగా ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం ఓ శుభవార్త తెలియజేసింది.
గర్భిణీలకూ కరోనా వ్యాక్సిన్ టీకా వేయవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గర్భిణీల్లో టీకా ప్రయోజనాలుంటాయని.. వారికి ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ పేర్కొన్నారు. ఇప్పటికైతే బాలింతలు టీకా తీసుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేశారు.
త్వరలోనే గర్భిణీలకూ టీకా వేయాలని గైడెన్స్ విడుదల చేయనున్నారు. చిన్నపిల్లలకు టీకాపైనా డాక్టర్ బలరాం భార్గవ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్క దేశంలో మాత్రమే పిల్లలకు వ్యాక్సిన్ వేస్తోందని చెప్పారు. 2-18 ఏళ్ల పిల్లలపై చిన్న అధ్యయనం చేపట్టామని.. త్వరలోనే దాని ఫలితాలు విడుదల అవుతాయని వెల్లడించారు.
మరీ చిన్నపిల్లలకు టీకా అవసరం రాకపోవచ్చని.. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
This post was last modified on June 26, 2021 3:47 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…