కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు.. వ్యాక్సిన్ ప్రక్రియను దేశంలో వేగవంతం చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు 18ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. కానీ.. చిన్నపిల్లలు, గర్భిణీలకు మాత్రం ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కాగా.. తాజాగా ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం ఓ శుభవార్త తెలియజేసింది.
గర్భిణీలకూ కరోనా వ్యాక్సిన్ టీకా వేయవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గర్భిణీల్లో టీకా ప్రయోజనాలుంటాయని.. వారికి ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ పేర్కొన్నారు. ఇప్పటికైతే బాలింతలు టీకా తీసుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేశారు.
త్వరలోనే గర్భిణీలకూ టీకా వేయాలని గైడెన్స్ విడుదల చేయనున్నారు. చిన్నపిల్లలకు టీకాపైనా డాక్టర్ బలరాం భార్గవ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్క దేశంలో మాత్రమే పిల్లలకు వ్యాక్సిన్ వేస్తోందని చెప్పారు. 2-18 ఏళ్ల పిల్లలపై చిన్న అధ్యయనం చేపట్టామని.. త్వరలోనే దాని ఫలితాలు విడుదల అవుతాయని వెల్లడించారు.
మరీ చిన్నపిల్లలకు టీకా అవసరం రాకపోవచ్చని.. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…