ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో… దీనికి మందు కనిపెట్టాలని.. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి మరీ.. కొన్ని రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ… ఈ మహమ్మారి అంతమౌతుందనే గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే.. ఇలా ఈ మహమ్మారి కాస్త తగ్గిపోయిందిలే అనుకొని ఊపిరి పీల్చుకునేలోపు.. మళ్లీ కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. దీంతో.. ఆ కొత్త రకం వేరియంట్లను ఎదుర్కోవడం అందరికీ సవాలుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సూపర్ న్యూస్ ని నిపుణులు మనకు అందజేశారు.
కరోనా కారణంగా భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధుల నుంచి రక్షణ అందించగల సూపర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ టీకాను ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించారు. ఈ టీకాను అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన వివరాలను విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నడిచే సైన్స్ పత్రికలో ప్రచురించారు.
శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణను రెండవతరం టీకాగా వర్ణించారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ టీకా కోవిడ్ -19 తో పాటు కరోనా వైరస్ కుటుంబంలోని అన్ని ప్రమాదకరమైన వైరస్లతో పోరాడటానికి సహాయ పడుతుంది. వచ్చే ఏడాది నాటికి ఈ టీకాను మనుషులపై పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. కరోనా వైరస్లోని కొత్త వేరియంట్లు భవిష్యత్తులో కొత్త అంటువ్యాధులకు దారి తీసే అవకాశముందని, అలాంటి ప్రమాదాన్ని నివారించడానికే ఈ టీకాను రూపొందిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎలుకలపై చేసిన పరీక్షల్లో ఈ టీకా ప్రతిరోధకాలను సృష్టించింది. ఇవి స్పైక్ ప్రోటీన్కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ టీకా దక్షిణాఫ్రికాలో కనిపించిన బీ.1.351 వేరియంట్పై కూడా ప్రభావాన్ని చూపించింది. కరోనా వైరస్ బయటి ఉపరితలంపై ముల్లు లాంటి భాగం నుంచి వైరస్ ప్రోటీన్ విడుదలవుతుంది. దీనిని స్పైక్ ప్రోటీన్ అంటారు.ఈ ప్రోటీన్తో ఇన్ఫెక్షన్ ప్రారంభమవుతుంది. ఇది మానవ ఎంజైమ్ ఏసీఈ2 రిస్పెక్టర్తో జతకట్టడం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. తద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
This post was last modified on June 24, 2021 9:00 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…