Trends

అక్కడ ఒక్క కాఫీ ప్యాకెట్ ధర రూ.7వేలు..!

మన దగ్గర ఓ కాఫీ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది..? మహా అయితే.. రూ.100 లేదంటే.. రూ.200 ఉంటుంది కదా.. కానీ.. ఉత్తర కొరియాలో మాత్రం.. కేవలం ఒక్క కాఫీ ప్యాకెట్ ధర రూ.7వేలపైనే. అదొక్కటే కాదు.. అక్కడ టీ పొడి.. అరటి పండ్లు.. ఇలా ప్రతి ఒక్క దాని ధర రూ.వేలల్లోనే ఉంది.

అవి అంత కాస్ట్ లీ అంటే.. వాటిలో ఏదైనా స్పెషాలిటీ ఉందని పొరపాటు పడకండి. ఎందుకంటే.. వాటిలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. కరోనా కారణంగా.. అక్కడ ఏర్పడిన పరిస్థితుల వల్ల ధరలు ఆకాశాన్నంటాయి. అక్కడ కనీసం తినడానికి కూడా తిండి దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఆహార పదార్థాల ధరలు.. ఇదిగో ఇలా ఆకాశాన్నంటేలా ఉన్నాయి.

ఉత్త‌ర కొరియాలో తీవ్ర‌మైన ఆహార కొర‌త ఏర్ప‌డింది. ఒక్క‌సారిగా ఆ దేశంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. టీ, కాఫీ పొడి ధ‌ర‌లు కూడా సామాన్యుల‌కు అంద‌నంత పైకి ఎగ‌బాకాయి. ఉత్త‌ర కొరియా రాజ‌ధాని ప్యాంగ్యాంగ్‌లో అయితే ప‌రిస్థితి మరీ ఘోరంగా త‌యారైంది.

కిలో అర‌టి పండ్లు కావాలంటే 45 డాల‌ర్లు అంటే భారత క‌రెన్సీలో చెప్పాలంటే రూ.3300గా ఉంది. ఒక‌ కాఫీ ప్యాకెట్ 100 డాల‌ర్లు (రూ.7400) ప‌లుకుతోంటే.. బ్లాక్ టీ ప్యాకెట్ కోసం 70 డాల‌ర్లు (రూ. 5,190) ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తోంది. దీంతో క‌నీస అవ‌స‌రాలు తీర్చుకోలేక ఉత్త‌ర కొరియా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

క‌రోనా కార‌ణంగా ఉత్త‌ర కొరియా త‌మ దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. దీనికి తోడు కొన్నాళ్ల క్రితం భారీ వ‌ర్షాలు, వరదల కార‌ణంగా ఆహార పంట‌లు దెబ్బ‌తిన్నాయి. దాదాపు 8 లక్షల టన్నుల దిగుబ‌డి వ‌చ్చే ఆహార పంట‌లు కొట్టుక‌పోయాయి. దీంతో త‌క్ష‌ణం ఆహారోత్ప‌త్తిని పెంచే మార్గాల‌పై కిమ్ ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది.

This post was last modified on June 22, 2021 8:44 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

5 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

6 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago