Trends

అక్కడ ఒక్క కాఫీ ప్యాకెట్ ధర రూ.7వేలు..!

మన దగ్గర ఓ కాఫీ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది..? మహా అయితే.. రూ.100 లేదంటే.. రూ.200 ఉంటుంది కదా.. కానీ.. ఉత్తర కొరియాలో మాత్రం.. కేవలం ఒక్క కాఫీ ప్యాకెట్ ధర రూ.7వేలపైనే. అదొక్కటే కాదు.. అక్కడ టీ పొడి.. అరటి పండ్లు.. ఇలా ప్రతి ఒక్క దాని ధర రూ.వేలల్లోనే ఉంది.

అవి అంత కాస్ట్ లీ అంటే.. వాటిలో ఏదైనా స్పెషాలిటీ ఉందని పొరపాటు పడకండి. ఎందుకంటే.. వాటిలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. కరోనా కారణంగా.. అక్కడ ఏర్పడిన పరిస్థితుల వల్ల ధరలు ఆకాశాన్నంటాయి. అక్కడ కనీసం తినడానికి కూడా తిండి దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఆహార పదార్థాల ధరలు.. ఇదిగో ఇలా ఆకాశాన్నంటేలా ఉన్నాయి.

ఉత్త‌ర కొరియాలో తీవ్ర‌మైన ఆహార కొర‌త ఏర్ప‌డింది. ఒక్క‌సారిగా ఆ దేశంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. టీ, కాఫీ పొడి ధ‌ర‌లు కూడా సామాన్యుల‌కు అంద‌నంత పైకి ఎగ‌బాకాయి. ఉత్త‌ర కొరియా రాజ‌ధాని ప్యాంగ్యాంగ్‌లో అయితే ప‌రిస్థితి మరీ ఘోరంగా త‌యారైంది.

కిలో అర‌టి పండ్లు కావాలంటే 45 డాల‌ర్లు అంటే భారత క‌రెన్సీలో చెప్పాలంటే రూ.3300గా ఉంది. ఒక‌ కాఫీ ప్యాకెట్ 100 డాల‌ర్లు (రూ.7400) ప‌లుకుతోంటే.. బ్లాక్ టీ ప్యాకెట్ కోసం 70 డాల‌ర్లు (రూ. 5,190) ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తోంది. దీంతో క‌నీస అవ‌స‌రాలు తీర్చుకోలేక ఉత్త‌ర కొరియా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

క‌రోనా కార‌ణంగా ఉత్త‌ర కొరియా త‌మ దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. దీనికి తోడు కొన్నాళ్ల క్రితం భారీ వ‌ర్షాలు, వరదల కార‌ణంగా ఆహార పంట‌లు దెబ్బ‌తిన్నాయి. దాదాపు 8 లక్షల టన్నుల దిగుబ‌డి వ‌చ్చే ఆహార పంట‌లు కొట్టుక‌పోయాయి. దీంతో త‌క్ష‌ణం ఆహారోత్ప‌త్తిని పెంచే మార్గాల‌పై కిమ్ ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది.

This post was last modified on June 22, 2021 8:44 am

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

4 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

8 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago