కరోనా సెకండ్ వేవ్ ఇచ్చిన షాక్ నుంచి దేశం ఇంకా కోలుకున్నది లేదు. సెప్టెంబరు చివరి వారంలో లేదంటే.. అక్టోబరులో మూడో వేవ్ ముంచుకొస్తుందన్న అంచనాలు ఇప్పటివరకు ఉన్నాయి. అందుకు భిన్నంగా మరోనెలలోనే ఆ ముప్పు ఉందంటూ తాజాగా విశ్లేషణులు మొదలయ్యాయి. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గి.. ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతి షురూ అవుతున్న వేళలో.. మూడో వేవ్ కు సంబంధించిన కీలక అలెర్టును మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దీంతో మూడో వేవ్ కు మనమెంతో దూరంలో లేమన్న విషయం స్పష్టమవుతోంది.
ఇప్పటికే మొదటి..రెండో వేవ్ లతో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రంగా మహారాష్ట్రను చెప్పాలి. మూడో వేవ్ సైతం ఆ రాష్ట్రం నుంచే షురూ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మూడో వేవ్ రావొచ్చని అంచనా వేసింది. ఇందుకు కారణాల్ని వెల్లడించింది.
లాక్ డౌన్ ను సడలిస్తున్న నేపథ్యంలో.. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారని.. ఈ నేపథ్యంలో మరో నెలలోనే మూడో వేవ్ ముంచుకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మూడో వేవ్ తీవ్రంగా ఉండొచ్చని.. తక్కువలో తక్కువ 8 లక్షల మంది యాక్టివ్ కేసులు ఉండొచ్చని.. బాధితుల్లో 10 శాతం మంది పిల్లలు ఉండే అవకాశం ఉందంటున్నారు.
మహారాష్ట్రలో తొలి వేవ్ లో 19 లక్షలు.. రెండో వేవ్ లో 40 లక్షలు నమోదు కావటం తెలిసిందే. ఇక.. మూడో వేవ్ విషయానికి వస్తే.. ఈసారి 80 లక్షల మంది వరకు మూడో వేవ్ లో మహమ్మారి బారిన ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం బెడ్లు.. ఆక్సిజన్.. మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదేశించారు. మరోమూడు నెలల వ్యవధి ఉందనుకున్న వేళ.. మూడో వేవ్ మరో నెలలోనే ముంచకొస్తుందన్న మాట భయాందోళనల్ని కలిగించటం ఖాయం. ఏమైనా.. ఎవరికివారు తీసుకునే జాగ్రత్తలే శ్రీరామరక్షగా చెప్పాలి.
This post was last modified on June 19, 2021 1:35 pm
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…