కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించడానికి కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కాగా.. ఈ వ్యాక్సిన్ విషయంలో తాజాగా.. ఓ అద్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది.
కరోనా నుంచి కోలుకున్న వారికి కేవలం సింగిల్ డోస్ కరోనా టీకా సరిపోతుందట. సింగిల్ డోస్ తోనే వారిలో రోగనిరోధక శక్తి సమకూరుతుందని తాజాగా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి జరపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్లో ఈ అధ్యయనం తాలూకు వివరాలు ఇటీవలే ప్రచురితమయ్యాయి.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోవిషీల్డ్ టీకా తీసుకున్న 260 హెల్త్ వర్కర్లలో రోగనిరోధక శక్తి స్థాయిలను అధ్యయనకారులు పరిశీలించి ఈ అంచనాకు వచ్చారు. కొవిడ్ సోకని వారికంటే వ్యాధి నుంచి కోలుకున్న వారిలో టీ, బీ రోగనిరోధక కణాల స్పందనలు అధికంగా ఉన్నాయని వారు గుర్తించారు.
వీరిలో యాంటీబాడీల ఉత్పత్తి కూడా అధికంగానే ఉందని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల తొలి టీకా డోసు తీసుకంటే..అది రెండు టీకా డోసులకు సమానమైన రోగనిరోధశక్తిని ప్రేరేపిస్తుందని వారు వ్యాఖ్యానించారు. టీకా కొరత కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ అధ్యయనం ప్రజల్లో నెలకొన్న ఆందోళనను కొంత మేర తగ్గించవచ్చని ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డా. నాగేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…