ప్రస్తుత కాలంలో ఏదైనా వస్తువు పోయిందీ అంటే… మళ్లీ దొరకడం కష్టం. ఇక అది విలువైనది అయితే… ఇక దాని మీద ఆశలు వదులుకోవాల్సిందే. కానీ.. ఓ మహిళకు 46ఏళ్ల క్రితం పొరపాటుగా పోగొట్టుకున్న ఉంగరం సోషల్ మీడియా పుణ్యమా అని.. మళ్లీ దక్కించుకుంది. అందుకే.. తన ఆనందాన్ని ఎలా తెలియజేయాలో అర్థంకాక సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మిచిగాన్ ప్రాంతానికి చెందిన మేరీ గజల్ అనే మహిళ.. 1975 లో అనుకోకుండా తన ఉంగరాన్ని పోగొట్టుకుంది. మళ్లీ ఆ ఉంగరం దొరుకుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆ ఉంగరం పోయిందని చాలా బాధపడింది. కానీ.. ఇటీవల ఆమెకు ఫేస్ బుక్ లో వచ్చిన ఓ మెసేజ్ చూసిన తర్వాత ఆమెకు పోయిన ప్రాణం మళ్లీ దొరికినట్లు అనిపించింది.
ఎందుకంటే.. ఆమె 46ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి ఇవ్వాలని అనుకుంటన్నట్లు క్రిస్ నార్డ్ అనే మహిళ ఆమెకు మెసేజ్ చేసింది. అది చూసి ఆమె ఆనందంతో పొంగిపోయింది. ముందు అసలు ఆ మెసేజ్ చూసి ఆమె షాక్ అయ్యింది.
‘ మీకు సంబంధించిన ఓ వస్తువు నా దగ్గర ఉంది’ అంటూ మెసేజ్ రావడం చూసి షాకైంది. ముందుగా అది ఏదైనా స్పామ్ ఏమో అని అనుకుంది. కానీ.. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత స్పామ్ కాదని తెలిసింది.
నార్డ్ అనే మహిళ ఓ ఫేస్ బుక్ పేజీలో ఈ ఉంగరం ఎవరిదో ఎవరికైనా తెలుసా అని పోస్టు చేసింది. దానిని మిగిలిన వాళ్లు చాలా మంది షేర్ చేయడంతో.. చివరకు మేరీది అని తెలిసింది. దీంతో.. ఆమెకు పర్సనల్ గా మెసేజ్ చేసి ఉంగరాన్ని అందించారు.
చివరకు.. 46ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి ఆమెకు దక్కింది. దీంతో.. ఆమె తన ఉంగరం దక్కడానికి కారణమైన సోషల్ మీడియాకు దన్యావాదాలు తెలియజేశారు.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…