ప్రస్తుత కాలంలో ఏదైనా వస్తువు పోయిందీ అంటే… మళ్లీ దొరకడం కష్టం. ఇక అది విలువైనది అయితే… ఇక దాని మీద ఆశలు వదులుకోవాల్సిందే. కానీ.. ఓ మహిళకు 46ఏళ్ల క్రితం పొరపాటుగా పోగొట్టుకున్న ఉంగరం సోషల్ మీడియా పుణ్యమా అని.. మళ్లీ దక్కించుకుంది. అందుకే.. తన ఆనందాన్ని ఎలా తెలియజేయాలో అర్థంకాక సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మిచిగాన్ ప్రాంతానికి చెందిన మేరీ గజల్ అనే మహిళ.. 1975 లో అనుకోకుండా తన ఉంగరాన్ని పోగొట్టుకుంది. మళ్లీ ఆ ఉంగరం దొరుకుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆ ఉంగరం పోయిందని చాలా బాధపడింది. కానీ.. ఇటీవల ఆమెకు ఫేస్ బుక్ లో వచ్చిన ఓ మెసేజ్ చూసిన తర్వాత ఆమెకు పోయిన ప్రాణం మళ్లీ దొరికినట్లు అనిపించింది.
ఎందుకంటే.. ఆమె 46ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి ఇవ్వాలని అనుకుంటన్నట్లు క్రిస్ నార్డ్ అనే మహిళ ఆమెకు మెసేజ్ చేసింది. అది చూసి ఆమె ఆనందంతో పొంగిపోయింది. ముందు అసలు ఆ మెసేజ్ చూసి ఆమె షాక్ అయ్యింది.
‘ మీకు సంబంధించిన ఓ వస్తువు నా దగ్గర ఉంది’ అంటూ మెసేజ్ రావడం చూసి షాకైంది. ముందుగా అది ఏదైనా స్పామ్ ఏమో అని అనుకుంది. కానీ.. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత స్పామ్ కాదని తెలిసింది.
నార్డ్ అనే మహిళ ఓ ఫేస్ బుక్ పేజీలో ఈ ఉంగరం ఎవరిదో ఎవరికైనా తెలుసా అని పోస్టు చేసింది. దానిని మిగిలిన వాళ్లు చాలా మంది షేర్ చేయడంతో.. చివరకు మేరీది అని తెలిసింది. దీంతో.. ఆమెకు పర్సనల్ గా మెసేజ్ చేసి ఉంగరాన్ని అందించారు.
చివరకు.. 46ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి ఆమెకు దక్కింది. దీంతో.. ఆమె తన ఉంగరం దక్కడానికి కారణమైన సోషల్ మీడియాకు దన్యావాదాలు తెలియజేశారు.
This post was last modified on June 11, 2021 4:21 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…