ప్రపంచంలో కెల్లా అత్యంత ధైర్యవంతుడు.. ఎవరు అంటే.. మీరు ఎవరి పేరు చెబుతారు..? ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మని అడిగితే మాత్రం.. దుబాయికి చెందిన ఓ ముసలాయను చూపిస్తున్నాడు. అంత ధైర్యవంతమైన పని ఆయన ఏం చేశాడో తెలుసా..? 37వ సారి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తన 28 మంది భార్యలు చూస్తుండగానే. అంతే కదా.. భార్య కళ్ల ముందు మరో అమ్మాయిని చూస్తూనే ఊరు కోరు అలాంటిది.. ఇతను ఏకంగా ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడం అంటే సాహసమే.
ఇంతకీ మ్యాటరేంటంటే…
దుబాయికి చెందిన ఓ వ్యక్తి 37 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది కూడా 28మంది భార్యల మధ్యలో వారిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక్క పెళ్లి చేసుకుందామంటేనే పిల్ల దొరకడం లేదు అంతమంది నీకు ఎలా దొరికారాని కొందరు అంటే.. భార్యలతో ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. ఒక్క పెళ్లాంతోనే వేగలేకపోతున్నాం.. ఇంత మందిని ఎలా భరిస్తున్నావు స్వామీ అంటూ కొందరు కామెంట్స్ పెట్టడం గమనార్హం. అసలు అంతమందిని ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఎలా అంగీకరించారంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 10, 2021 4:55 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…