Trends

జనాలకు గుడ్ న్యూస్

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గకముందే థర్డ్ వేవ్ గురించి భయపడుతున్న జనాలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందరు ఆందోళనపడుతున్నట్లు థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందని ఆందోళనలో ఉన్న తల్లి, దండ్రులకు గులేరియా ప్రకటన పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.

మూడో దశకలో కరోనా వైరస్ ప్రధానంగా చిన్నపిల్లలపైనే ప్రభావం చూపుతుందనటానికి సరైన ఆధారాలు లేవన్నారు. అంతమాత్రాన జనాలకు అజాగ్రత్తగా ఉంటే కొంపముణిగిపోవటం ఖాయమని కూడా హెచ్చరించారు. కరోనా వైరస్ ఇంత తీవ్రంగా వ్యాపించటానికి, ఇన్ని వేరియంట్లు పుట్టుకురావటానికి మనమే కారణమని ఘాటుగా వ్యాఖ్యానించారు.

కోవిడ్ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా జనాలంతా రోడ్లపై తిరిగేయటం వల్లే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినట్లు చెప్పారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గాలన్నా, కొత్త వేరియంట్లు పుట్టటం ఆగిపోవాలన్నా జనాలంతా కచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో ఇబ్బందులు పడినవారిలో కూడా చిన్నపిల్లలున్న విషయాన్ని గులేరియా గుర్తుచేశారు.

కరోనా తీవ్రత, వేరియంట్ల పుట్టుకపై గులేరియా చెప్పింది నూటికి నూరుశాతం కరెక్టే అనటంలో సందేహం లేదు. ఒకవైపు ప్రభుత్వాలు లాక్ డౌన్ అని కర్ఫ్యూలని ఎంత కట్టడి చేస్తున్నా చాలాచోట్ల జనాలు రోడ్లపైనే కనబడుతున్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెబుతున్న పోలీసులపై జనాలు ఎంతలా తిరగబడుతున్నది అందరు చూస్తున్నదే. మనంతట మనమే కరోనా వైరస్ ను మనింట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి చిచ్చు పెడుతున్నది.

This post was last modified on June 9, 2021 11:18 am

Share
Show comments
Published by
satya

Recent Posts

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

3 mins ago

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని ఆగుతున్నాం: బొత్స

ఏపీ అధికార పార్టీ వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని…

3 hours ago

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

12 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

13 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

14 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

15 hours ago