కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గకముందే థర్డ్ వేవ్ గురించి భయపడుతున్న జనాలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందరు ఆందోళనపడుతున్నట్లు థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందని ఆందోళనలో ఉన్న తల్లి, దండ్రులకు గులేరియా ప్రకటన పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.
మూడో దశకలో కరోనా వైరస్ ప్రధానంగా చిన్నపిల్లలపైనే ప్రభావం చూపుతుందనటానికి సరైన ఆధారాలు లేవన్నారు. అంతమాత్రాన జనాలకు అజాగ్రత్తగా ఉంటే కొంపముణిగిపోవటం ఖాయమని కూడా హెచ్చరించారు. కరోనా వైరస్ ఇంత తీవ్రంగా వ్యాపించటానికి, ఇన్ని వేరియంట్లు పుట్టుకురావటానికి మనమే కారణమని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కోవిడ్ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా జనాలంతా రోడ్లపై తిరిగేయటం వల్లే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినట్లు చెప్పారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గాలన్నా, కొత్త వేరియంట్లు పుట్టటం ఆగిపోవాలన్నా జనాలంతా కచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో ఇబ్బందులు పడినవారిలో కూడా చిన్నపిల్లలున్న విషయాన్ని గులేరియా గుర్తుచేశారు.
కరోనా తీవ్రత, వేరియంట్ల పుట్టుకపై గులేరియా చెప్పింది నూటికి నూరుశాతం కరెక్టే అనటంలో సందేహం లేదు. ఒకవైపు ప్రభుత్వాలు లాక్ డౌన్ అని కర్ఫ్యూలని ఎంత కట్టడి చేస్తున్నా చాలాచోట్ల జనాలు రోడ్లపైనే కనబడుతున్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెబుతున్న పోలీసులపై జనాలు ఎంతలా తిరగబడుతున్నది అందరు చూస్తున్నదే. మనంతట మనమే కరోనా వైరస్ ను మనింట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి చిచ్చు పెడుతున్నది.
This post was last modified on June 9, 2021 11:18 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…