Trends

ఫెయిలైన చోక్సీ మాస్టర్ ప్లాన్

ఆంటీగ్వా నుండి మొహుల్ చోక్సీని కిడ్నాప్ చేసి డొమినికాకు ఎత్తుకెళ్ళారనే ప్రచారమంతా ఉత్త డ్రామా అనే విషయం బయపడుతోంది. కిడ్నాప్ జరిగిందని చెబుతున్న సమయానికి, డొమినికాలో చోక్సీ ప్రత్యక్షమైన సమయానికి మధ్యలో చాలా తేడాలున్నట్లు ఇటు ఆంటీగ్వా అటు డొమినికా పోలీసులు గ్రహించారు. ఆంటీగ్వా-డొమినికా మధ్య సముద్రమార్గంలో 120 మైళ్ళ దూరం ఉంది. ఈ సమయాన్ని ఎంత వేగంగా ప్రయాణించినా కవర్ చేయటానికి కనీసం 12 గంటలు పడుతుందట.

దీని ప్రకారం ఆంటీగ్వాలో బయలుదేరి డొమినికాకు చేరే సమయానికి సంబంధించి చోక్సీ చేస్తున్న వాదనకు, చోక్సీ డొమినికాలో పట్టుబడిన సమయానికి, అదే సమయంలో ఆంటీగ్వాలో చోక్సీ కుటుంబసభ్యులు చెప్పిన సమాచారానికి చాలా తేడాలున్నాయి. దీన్ని బట్టి ఆంటీగ్వాలో ఉంటే భారత్ కు తనను పట్టి ఇవ్వటం ఖాయమని అర్ధం చేసుకున్న తర్వాతే చోక్సీ డొమినికాకు పారిపోయినట్లు నిర్ధారణవుతోంది. మామూలుగా అయితే ఆంటీగ్వా నుండి డొమినికాకు వెళ్ళాలంటే పోలీసులు అంగీకరించరు.

ఎందుకంటే అప్పటికే చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యుంది. అందుకనే దొంగమార్గం ద్వారా డొమినికాకు పారిపోయి అక్కడ నుండి క్యూబాకు వెళ్ళిపోవటానికి చోక్సీ పెద్ద ప్లానే వేసుకున్నాడు. క్యూబాలో కూడా చోక్సీ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడట. అంటే ఇపుడు బయటపడుతున్న విషయాలను గమనిస్తుంటే భారత్ నుండి పారిపోవటానికి చాలా కాలం ముందు నుండే చోక్సీ మాస్టర్ ప్లాన్ వేసుకున్న విషయం అర్ధమైపోతోంది.

ఇక కస్టడీలో ఉండగా డొమినికా పోలీసులు తనను కొట్టారని చోక్సీ చేసిన ఆరోపణలు కూడా వీగిపోయాయి. తన చేతిమీద, కంటిపైన పోలీసులు కొట్టారని చోక్సీ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. చేతిమీదున్న గాయాలు పాతవే అని డొమినికాలో వైద్యులు తేల్చేశారు. ఇక కంటిమీద గాయం నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికైనా అయ్యేదేననని వైద్యులు తేల్చేశారు. మొత్తంమీద ఆంటీగ్వా టు క్యూబా వయా డొమినికాకు పారిపోవటానికి చోక్సీ వేసుకున్న ప్లాన్ చివరి నిముషంలో ఫ్లాప్ అయ్యింది.

This post was last modified on June 8, 2021 4:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

1 hour ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

1 hour ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

2 hours ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago