ఆంటీగ్వా నుండి మొహుల్ చోక్సీని కిడ్నాప్ చేసి డొమినికాకు ఎత్తుకెళ్ళారనే ప్రచారమంతా ఉత్త డ్రామా అనే విషయం బయపడుతోంది. కిడ్నాప్ జరిగిందని చెబుతున్న సమయానికి, డొమినికాలో చోక్సీ ప్రత్యక్షమైన సమయానికి మధ్యలో చాలా తేడాలున్నట్లు ఇటు ఆంటీగ్వా అటు డొమినికా పోలీసులు గ్రహించారు. ఆంటీగ్వా-డొమినికా మధ్య సముద్రమార్గంలో 120 మైళ్ళ దూరం ఉంది. ఈ సమయాన్ని ఎంత వేగంగా ప్రయాణించినా కవర్ చేయటానికి కనీసం 12 గంటలు పడుతుందట.
దీని ప్రకారం ఆంటీగ్వాలో బయలుదేరి డొమినికాకు చేరే సమయానికి సంబంధించి చోక్సీ చేస్తున్న వాదనకు, చోక్సీ డొమినికాలో పట్టుబడిన సమయానికి, అదే సమయంలో ఆంటీగ్వాలో చోక్సీ కుటుంబసభ్యులు చెప్పిన సమాచారానికి చాలా తేడాలున్నాయి. దీన్ని బట్టి ఆంటీగ్వాలో ఉంటే భారత్ కు తనను పట్టి ఇవ్వటం ఖాయమని అర్ధం చేసుకున్న తర్వాతే చోక్సీ డొమినికాకు పారిపోయినట్లు నిర్ధారణవుతోంది. మామూలుగా అయితే ఆంటీగ్వా నుండి డొమినికాకు వెళ్ళాలంటే పోలీసులు అంగీకరించరు.
ఎందుకంటే అప్పటికే చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యుంది. అందుకనే దొంగమార్గం ద్వారా డొమినికాకు పారిపోయి అక్కడ నుండి క్యూబాకు వెళ్ళిపోవటానికి చోక్సీ పెద్ద ప్లానే వేసుకున్నాడు. క్యూబాలో కూడా చోక్సీ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడట. అంటే ఇపుడు బయటపడుతున్న విషయాలను గమనిస్తుంటే భారత్ నుండి పారిపోవటానికి చాలా కాలం ముందు నుండే చోక్సీ మాస్టర్ ప్లాన్ వేసుకున్న విషయం అర్ధమైపోతోంది.
ఇక కస్టడీలో ఉండగా డొమినికా పోలీసులు తనను కొట్టారని చోక్సీ చేసిన ఆరోపణలు కూడా వీగిపోయాయి. తన చేతిమీద, కంటిపైన పోలీసులు కొట్టారని చోక్సీ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. చేతిమీదున్న గాయాలు పాతవే అని డొమినికాలో వైద్యులు తేల్చేశారు. ఇక కంటిమీద గాయం నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికైనా అయ్యేదేననని వైద్యులు తేల్చేశారు. మొత్తంమీద ఆంటీగ్వా టు క్యూబా వయా డొమినికాకు పారిపోవటానికి చోక్సీ వేసుకున్న ప్లాన్ చివరి నిముషంలో ఫ్లాప్ అయ్యింది.
This post was last modified on June 8, 2021 4:13 pm
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…