వేసవికాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. ఆ పండు కీ.. ఈ సీజన్ కి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ కాలంలో ఎక్కడ చూసినా బుట్టలు బుట్టలుగా మామిడి పండ్లు కనపడుతూనే ఉంటాయి. కొందరు పచ్చి కాయలతో పచ్చడి పెట్టుకుంటే.. కొందరు.. తీయని పండ్లను ఆస్వాదిస్తారు. రేటు మాట ఎలా ఉన్నా.. ఎండాకాలంలో మామిడి పండు తినని వారు చాలా అరుదనే చెప్పాలి.
అయితే.. ఇప్పుడు మనం చెప్పుకునే మామిడి పండు మాత్రం పూర్తిగా భిన్నం. అన్ని మామిడి పండ్లు ఎండాకాలంలో కాస్తే.. ఈపండు మాత్రం వర్షాకాలంలో కాస్తుంది. అందుకే కాబోలు దీని డిమాండ్ మామూలుగా ఉండదు. ఈ పండు కేవలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పడుతుంది. మరి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా..
మధ్యప్రదేశ్కు చెందిన ‘నూర్జాహాన్’ రకం మామిడి పండుల్లో అన్నిటికన్నా చాలా స్పెషల్. ఈ మామిడి పండు బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ధర వెయ్యి రూపాయలు పలుకుతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీని పంట జూన్ నెల నుంచి ప్రారంభమవుతుంది. అంటే మన దేశవాళీ రకాల పంట పూర్తిగా అయిపోయిన తరువాత ‘నూర్జహాన్’ పంట మార్కెట్లోకి వస్తుంది. దీనికి పూత జనవరి, ఫిబ్రవరి నెలలో వస్తుంది.
‘నూర్జహాన్’ మామిడి పండ్లు ఆఫ్ఘన్ ప్రాంతానికి చెందిన మామిడి రకం. గుజరాత్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న అలీరాజ్పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో మాత్రమే ఈ మామిడి పెంపకం సాగు చేస్తారు. ఇలా.. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం ఈసారి పెద్దగా ఉండడంతో.. నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతులు చెపుతున్నారు.
“నా తోటలో మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 మామిడి పండ్లు పండాయి. ఒక్కో పండుకు రూ. 500 నుంచి రూ. 1,000 ధర పలుకుతోంది. ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్లు చేసుకుంటారు. ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య వుంది. 2019లో ఒక్కో పండు 2.75 కేజల బరువుతో పండింది. అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికింది.” అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు .. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బుకింగ్ చేసుకొని దాని రుచి ఏంటో ఒకసారి చూడండి.
This post was last modified on June 7, 2021 3:56 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…