వేసవికాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. ఆ పండు కీ.. ఈ సీజన్ కి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ కాలంలో ఎక్కడ చూసినా బుట్టలు బుట్టలుగా మామిడి పండ్లు కనపడుతూనే ఉంటాయి. కొందరు పచ్చి కాయలతో పచ్చడి పెట్టుకుంటే.. కొందరు.. తీయని పండ్లను ఆస్వాదిస్తారు. రేటు మాట ఎలా ఉన్నా.. ఎండాకాలంలో మామిడి పండు తినని వారు చాలా అరుదనే చెప్పాలి.
అయితే.. ఇప్పుడు మనం చెప్పుకునే మామిడి పండు మాత్రం పూర్తిగా భిన్నం. అన్ని మామిడి పండ్లు ఎండాకాలంలో కాస్తే.. ఈపండు మాత్రం వర్షాకాలంలో కాస్తుంది. అందుకే కాబోలు దీని డిమాండ్ మామూలుగా ఉండదు. ఈ పండు కేవలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పడుతుంది. మరి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా..
మధ్యప్రదేశ్కు చెందిన ‘నూర్జాహాన్’ రకం మామిడి పండుల్లో అన్నిటికన్నా చాలా స్పెషల్. ఈ మామిడి పండు బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ధర వెయ్యి రూపాయలు పలుకుతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీని పంట జూన్ నెల నుంచి ప్రారంభమవుతుంది. అంటే మన దేశవాళీ రకాల పంట పూర్తిగా అయిపోయిన తరువాత ‘నూర్జహాన్’ పంట మార్కెట్లోకి వస్తుంది. దీనికి పూత జనవరి, ఫిబ్రవరి నెలలో వస్తుంది.
‘నూర్జహాన్’ మామిడి పండ్లు ఆఫ్ఘన్ ప్రాంతానికి చెందిన మామిడి రకం. గుజరాత్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న అలీరాజ్పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో మాత్రమే ఈ మామిడి పెంపకం సాగు చేస్తారు. ఇలా.. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం ఈసారి పెద్దగా ఉండడంతో.. నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతులు చెపుతున్నారు.
“నా తోటలో మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 మామిడి పండ్లు పండాయి. ఒక్కో పండుకు రూ. 500 నుంచి రూ. 1,000 ధర పలుకుతోంది. ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్లు చేసుకుంటారు. ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య వుంది. 2019లో ఒక్కో పండు 2.75 కేజల బరువుతో పండింది. అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికింది.” అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు .. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బుకింగ్ చేసుకొని దాని రుచి ఏంటో ఒకసారి చూడండి.
This post was last modified on June 7, 2021 3:56 pm
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…
జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయిక.. ఫరియా అబ్దుల్లా. థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి…