అదేంటి? అని నోరెళ్లబెడుతున్నారా? మీరు చదివింది నిజమే! కరోనా కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడు మాస్కు జపం చేస్తున్న విషయం తెలిసిందే. మాస్కు పెట్టుకోకపోతే… దాదాపు అన్ని దేశాల్లో భారీ ఎత్తున జరిమానా విధిస్తున్నారు. ఇక్కడ మన దేశంలోనూ మాస్కు పెట్టుకోకపోతే.. జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఒక దేశంలో మాత్రం మాస్కు పెట్టుకుంటే జరిమానా వేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ విశేషం.. ఇదీ..
అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో ఇకపై మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్హెడ్ కేఫ్ రెస్టారెంట్ అధినేత క్రిస్ తన కష్టమర్లకు విస్తుపోయే నిబంధన అమలు చేస్తున్నారు. రెస్టారెంట్లోకి మాస్క్ ధరించి వస్తే బిల్లుపై 5 డాలర్లు(350 రూపాయలు) అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నిబంధన విధించారు.
అమెరికాలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేకున్నా చాలా మంది కరోనా వ్యాప్తికి భయపడి మాస్క్లు ధరించే రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది రెస్టారెంట్లో అదనంగా 5 డాలర్లు చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు గానీ మాస్క్ తీసేయడానికి ససేమిరా అంటున్నారు. దీంతో రెస్టారెంట్లో బిల్లుపై అదనంగా 5 డాలర్లు చొప్పున బాగానే వసూలవుతున్నాయి.
ఇక, ఇలా వసూలైన నగదును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు ఆ రెస్టారెంట్ యజమాని క్రిస్ కాస్టిల్మ్యాన్ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థకు చేయూత ఇవ్వడం కోసం కస్టమర్ల నుంచి 5 డాలర్లు ఈ విధంగా వసూలు చేయడం తన దృష్టిలో తప్పు కాదని క్రిస్ చెప్పుకొచ్చాడు. ఇక, ఈ విషయంపై అధికారులు కూడా మౌనం పాటించారు. ప్రభుత్వమే వద్దన్నాక ధరించడం ఎందుకని వారు కూడా ప్రశ్నిస్తున్నారు. అయినా.. ప్రజల్లో మాత్రం కరోనా భయం పోకపోవడం గమనార్హం. ఇదీ.. సంగతి!
This post was last modified on June 7, 2021 3:53 pm
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…