Trends

టీకా మిక్సింగ్ ఎన్ని దేశాల్లో ఉందో తెలుసా ?

టీకా మిక్సింగ్..ఇపుడు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశం. కరోనా వైరస్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తిచేయటమే మార్గమని ప్రపంచదేశాలన్నీ అంగీకరిస్తున్నాయి. వ్యాక్సిన్ తయారుచేస్తున్న ఏ కంపెనీ టీకానైనా ప్రతి ఒక్కళ్ళు రెండు డోసులు వేసుకుంటునే ఉపయోగాలుంటాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.

అయితే ఇదే సమయంలో టీకాల మిక్సింగ్ గురించి కూడా చాలా దేశాలు ప్రయోగాలు మొదలుపెట్టాయి. టీకా మిక్సింగ్ అంటే మొదటి డోసు ఒక కంపెనీది వేసుకుంటే రెండో డోసు మరో కంపెనీది అన్నమాట. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే మొదటి డోసు మనదేశంలో కోవాగ్జిన్ వేసుకుంటే రెండో డోసు కోవీషీల్డ్ వేసుకోవటం అన్నమాట. మనదేశంలో ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నా ఇంకా జనాలకు అందుబాటులోకి తేలేదు.

అయితే ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పద్దతిని ఆచరణలోకి తీసుకొచ్చేశాయి. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, స్వీడెన్, నార్వే, డెన్నార్క్ లాంటి దేశాలు తమ జనాలకు టీకాలు మిక్సింగ్ తీసుకోమని సూచిస్తున్నాయి. పై దేశాల్లో జనాలు మొదటి డోసును ఫైజర్ కంపెనీది తీసుకుంటే రెండు వారాలు లేదా నెలరోజుల తర్వాత ఆస్త్రాజెనికా టీకాలను వేస్తున్నారు. కాకపోతే టీకాల మిక్సింగ్ తర్వాత కొందరిలో కొద్దిపాటి జ్వరం, వొళ్ళునొప్పులు, తలతిరగడం, కీళ్ళనొప్పుల లక్షణాలు కనిపించినట్లు ప్రయోగాల్లో తేలింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీకా మిక్సింగ్ వల్ల ఉపయోగాలా ? లేకపోతే నష్టాలా ? అనే విషయంలో చాలా దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలేమో కొద్దిపాటి సమస్యలు తప్ప చెప్పుకోదగ్గ నష్టాలేమీ కనబడలేదని తేల్చేశాయి. అందుకనే తమ జనాలకు టీకా మిక్సింగ్ కు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నాయి. టీకా మిక్సింగ్ వల్ల జనాల్లో రోగనిరోధకశక్తి పెరిగినట్లు కూడా శాస్త్రజ్ఞులు గుర్తించారు. మరి మన దేశంలో టీకా మిక్సింగ్ మనకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.

This post was last modified on June 6, 2021 7:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

45 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

48 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago