Trends

రెండు డోసులు వేసుకున్నా చనిపోతున్నారా ?

కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నవారిలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగానే ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు. ఇది కొందరిలో వాస్తవమే అయ్యుండచ్చు కానీ అందరిలోను కాదు. ఈ విషయం సీషెల్స్ దేశంలో నిరూపణయ్యింది. దాంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. విషయం ఏమిటంటే సీషెల్స్ అనేది ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ దేశంలో కోవిడ్ కారణంగా ప్రపంచ పర్యాటకులకు తలుపులు మూసేశారు. అయితే దేశంలో టీకాల కార్యక్రమం స్పీడందుకున్న నేపధ్యంలో కరోనా కేసులు కూడా బాగా తగ్గిపోయాయి. 98 వేల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటికి 61 శాతం జనాభాకు రెండు డోసుల టీకాలు వేశారు. టీకాల కార్యక్రమాన్ని ఇక్కడ నూరుశాతం ప్రభుత్వమే చేస్తోంది.

లాక్ డౌన్, కర్ఫ్యూ, భౌతికదూరం పాటించటం లాంటి వాటితో టీకాల కార్యక్రమం చాలా జోరుగా జరగటంతో కేసుల తీవ్రత బాగా తగ్గిపోయింది. ఎలాగూ కేసులు తగ్గిపోయింది కాబట్టి ప్రపంచపర్యాటకానికి గేట్లు ఎత్తేసింది అక్కడి ప్రభుత్వం. ఇంకేముంది పర్యాటకులందరు సీషెల్స్ లోకి పరుగులు పెట్టారు. స్ధానిక జనాభాతో పాటు పర్యాటకుల సంఖ్య పెరిగిపోవటంతో భౌతికదూరం పాటించటం, మాస్కులు ధరించటం మానేశారు.

ఎప్పుడైతే కోవిడ్ జాగ్రత్తలు మానేశారో వెంటనే కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోందట. మే నెల మొదటివారంలో ఉన్న 3800 కేసులు ఇప్పటికి 10 వేలకు పెరిగిపోయాయట. అలాగే మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో రెండు డోసుల టీకాలు వేయించినా ఉపయోగం లేదని తేలిపోయింది. కారణం ఏమిటంటే జాగ్రత్తలు తీసుకోకపోవటమే. అంటే టీకాలు వేయించుకున్ననిర్లక్ష్యంతో జాగ్రత్తలను గాలికొదిలేస్తే ప్రాణాలు కూడా పోతాయని తాజాగా నిరూపితమైంది.

This post was last modified on May 25, 2021 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

2 hours ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

3 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

5 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

6 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

6 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

7 hours ago