Trends

రెండు డోసులు వేసుకున్నా చనిపోతున్నారా ?

కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నవారిలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగానే ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు. ఇది కొందరిలో వాస్తవమే అయ్యుండచ్చు కానీ అందరిలోను కాదు. ఈ విషయం సీషెల్స్ దేశంలో నిరూపణయ్యింది. దాంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. విషయం ఏమిటంటే సీషెల్స్ అనేది ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ దేశంలో కోవిడ్ కారణంగా ప్రపంచ పర్యాటకులకు తలుపులు మూసేశారు. అయితే దేశంలో టీకాల కార్యక్రమం స్పీడందుకున్న నేపధ్యంలో కరోనా కేసులు కూడా బాగా తగ్గిపోయాయి. 98 వేల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటికి 61 శాతం జనాభాకు రెండు డోసుల టీకాలు వేశారు. టీకాల కార్యక్రమాన్ని ఇక్కడ నూరుశాతం ప్రభుత్వమే చేస్తోంది.

లాక్ డౌన్, కర్ఫ్యూ, భౌతికదూరం పాటించటం లాంటి వాటితో టీకాల కార్యక్రమం చాలా జోరుగా జరగటంతో కేసుల తీవ్రత బాగా తగ్గిపోయింది. ఎలాగూ కేసులు తగ్గిపోయింది కాబట్టి ప్రపంచపర్యాటకానికి గేట్లు ఎత్తేసింది అక్కడి ప్రభుత్వం. ఇంకేముంది పర్యాటకులందరు సీషెల్స్ లోకి పరుగులు పెట్టారు. స్ధానిక జనాభాతో పాటు పర్యాటకుల సంఖ్య పెరిగిపోవటంతో భౌతికదూరం పాటించటం, మాస్కులు ధరించటం మానేశారు.

ఎప్పుడైతే కోవిడ్ జాగ్రత్తలు మానేశారో వెంటనే కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోందట. మే నెల మొదటివారంలో ఉన్న 3800 కేసులు ఇప్పటికి 10 వేలకు పెరిగిపోయాయట. అలాగే మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో రెండు డోసుల టీకాలు వేయించినా ఉపయోగం లేదని తేలిపోయింది. కారణం ఏమిటంటే జాగ్రత్తలు తీసుకోకపోవటమే. అంటే టీకాలు వేయించుకున్ననిర్లక్ష్యంతో జాగ్రత్తలను గాలికొదిలేస్తే ప్రాణాలు కూడా పోతాయని తాజాగా నిరూపితమైంది.

This post was last modified on May 25, 2021 10:44 am

Share
Show comments
Published by
satya

Recent Posts

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

57 mins ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

1 hour ago

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

3 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

4 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

9 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

10 hours ago